సీఎం జగన్ను నిద్ర లేపడానికే వచ్చాను: అరుణ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ ను నిద్ర లేపడానికే వచ్చానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం ధమన కాండ ను చెప్పడానికే వచ్చానని, ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్నారు. ఏపీలో పోలీస్ స్టేషన్లు తగులబెట్టారు..పోలీస్ లపై దాడులు చేస్తున్నారు…అలాంటి వారిపై తక్కువ యాక్షన్ తీసుకొని బీజేపీ క్యాడర్ పై కేసులు పెడుతున్నారని అరుణ్ సింగ్ ఆరోపించారు. యూపీలో సీఎం ఎస్పీ ప్రభుత్వంలో మతదాడులు జరిగేవి.. 2017లో ప్రజలు ఎస్పీ ప్రభుత్వాన్ని జనం ఎత్తేశారు. ఇది జగన్ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీని దించి బీజేపీని గద్దెనెక్కిస్తారన్నారు. అస్సాంలో కూడా కాంగ్రెస్ ఓటు రాజకీయాలు చేసినందుకు ఆ ఆ పార్టీని దించి బీజేపీకి అధికారం ఇచ్చారన్నారు.
Read Also:కొడాలి నానిపై వచ్చిన ఆరోపణలు నిరూపించడానికి సిద్ధం: బోండా ఉమ
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గుణపాఠం చెప్పారన్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కూడా వారి బాలికలు బయటికి వచ్చే పరిస్థితులు ఉండవన్నారు. పాకిస్తాన్ గెలిచినప్పుడు సంబురాలు చేసుకుంటున్నారు. అన్ని మతాల అభివృద్ధిని కోరుతూ మోడీ పరిపాలిస్తున్నారు. జగన్ మోడీ పాలనను చూసి నేర్చుకోవాలంటూ చురకలు అంటించారు. ఎమ్మెల్యే చక్రపాణి తల్లిదండ్రులు మంచి పేరు ఎత్తారు…ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడుతూ మసీదు నిర్మాణాన్ని ప్రోత్సహించారు. జగన్ అధికారంలోకి వచ్చే ముందు 3 వేల కి.మీ పాదయాత్ర చేసి జనంలోకి వచ్చారు… జగన్ అధికారంలోకి వచ్చాక జనంలోకి రావడం లేదు…ఎంపీ , ఎమ్మెల్యేలను కూడా కలవడం లేదన్నారు. మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే సీఎం జగన్ తన లేబుల్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని అరుణ్ సింగ్ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!