సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నాకు తమ్ముడిగా నటించిన మన తెలుగు కుర్రాడు శ్రీనాథ్ మాగంటి, తాజాగా ఒక పాడ్కాస్ట్లో రణ్బీర్ కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రణ్బీర్ లాంటి పెద్ద స్టార్ సెట్స్లో ఎంత సింపుల్గా ఉంటారో చెబుతూ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ వివరించారు.
Also Read : Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్పై యామీ గౌతమ్ ఫైర్!
శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘రణ్బీర్ సెట్స్కి వచ్చేటప్పుడు తన వెంట పెద్ద సైన్యాన్ని వేసుకొని రారు. చాలా సాదాసీదాగా వస్తారు. ఆయన సెట్స్లో అందరి కోసం ఒక పెద్ద ప్లేట్ నిండా హెల్తీ చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు తెప్పించేవారు. నేను మొదటిసారి ఆ ప్లేట్ చూసి.. ‘సార్ ఒక్కరే అంత తింటారా?’ అని ఆశ్చర్యపోయాను. తెలియక అందులోంచి ఒక స్నాక్ తీసుకుంటే, ఎవరో వచ్చి నన్ను ఆపారు. అది సార్ ప్లేట్ అని చెప్పారు’ అని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రణ్బీర్ వెంటనే జోక్యం చేసుకున్నారట. తనదైన స్టైల్లో సరదాగా కొన్ని బూతులు తిడుతూ.. ‘అరేయ్.. అతన్ని తిననివ్వు, ఆ ప్లేట్ పెట్టిందే అందరి కోసం’ అని నవ్వుతూ చెప్పారట.. ‘ఆయన బూతులు తిట్టినా అది ఎంతో ప్రేమగా అనిపించింది. నేను కలిసిన అత్యంత నిగర్వి ఆయన’ అంటూ రణ్బీర్పై శ్రీనాథ్ ప్రశంసలు కురిపించారు.
ప్రజంట్ రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమాలో మెరిసిన శ్రీనాథ్ మాగంటి, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ENE 2) లో ఒక హీరోగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రణ్బీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ సినిమా 2026 దీపావళికి విడుదల కానుంది.