వైయస్సార్ పేరు లేకుండా చేస్తున్న ఇలాంటి వారా? వైఎస్సార్ వారసులు? అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. కడపలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరును చార్జిషీట్లో పెట్టిన పార్టీ.. నన్ను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ.. చార్జిషీట్ లో మనమే ఆ పేరు పెట్టించామట.. ఎంతటి దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్దిదారాల ఖాతాల్లో ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయటంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది... ఈ నెల 14వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలందరూ ఏకమై.. వైసీపీని గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి అని పిలుపునిచ్చారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.
గౌరు చరిత రెడ్డి ప్రజలను ఓటు అభ్యర్థిస్తూ.. పాణ్యం నియోజకవర్గ ఓటర్లకు ఓ హామీ పత్రాన్ని విడుదల చేశారు. తనకు ఈసారి అవకాశం ఇస్తే.. ఓర్వకల్లు కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.