ప్రైవేటు హాస్పిటళ్ళ దందా పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆరోగ్య శ్రీ కింద ఉచిత చికిత్సల విషయంలో కృష్ణాజిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఆస్పత్రుల్లో కచ్చితంగా 50శాతం బెడ్లు కచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లుకు ఇవ్వాలి. వివిధ బీమా సంస్థల రేట్లతో పోలిస్తే.. మన ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రకటించిన రేట్లకు కచ్చితంగా రోగులకు సేవలు అందాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నియంత్రణ, నిబంధనలు కచ్చితంగా అమలు కావాలి అన్నారు. ఆరోగ్య మిత్రలు, సీసీ కెమెరాలు…
నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో…
కరోనా విషయంలో ముఖ్యమంత్రికి ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదు.. అధికారులు ఫోన్ కూడా ఎత్తరు. ముఖ్యమంత్రి లేఖలకు ప్రధానమంత్రి స్పందన కూడా ఇలాగే ఉంటుంది అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కరోనా తో ప్రజలు సహజీవనం చేయాలంటారు ఆయన మాత్రం ఇంట్లో ఉంటారు. కరోనా లేనప్పుడు కూడా అతి ఎక్కువ కాలం హోమ్ క్వారంటైన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు.…
రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది. అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
ఏపీ సీఎం జగన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, నియంత్రణ పై సీఎం జగన్ తో చర్చించారు ప్రధాని. ఏపీతో పాటు తెలంగాణ, ఒరిస్సా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ లతోనూ మాట్లాడాడు మోదీ. అయితే కోవిడ్ వైరస్ విస్తరణ, నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించిన సీఎం, పీఎమ్.. కోవిడ్ వైరస్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, వైరస్ సోకిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రధానికి…
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… జగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభం. ఈనెల 25 నాటికి ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు నిర్వహించండి. నీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలి.…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులను బట్టి తరువాత పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏపీ సీఎం జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఏపీలో కరోనా పరీక్షలు లక్ష…
రేపు కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. అయితే ఇందులో కరోనా నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పదవ తరగతి పరీక్షలు రద్దు అలాగే ఇంటర్ పరీక్షలు వాయిదా పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరీక్షల రద్దుతో పాటుగా స్కూళ్లకు శెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో సర్కార్… దేవాలయాల్లో, మత సంస్థలతో పాటుగా బార్లు, రెస్టారెంట్ల…
ఏపీ–అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు జిల్లాలో పాల సేకరణను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు సీఎం జగన్ గుంటూరు జిల్లాలో కొత్తగా 129 గ్రామాలతో పాటు, చిత్తూరు జిల్లాలో అదనంగా మరో 174 గ్రామాల నుంచి అమూల్ ద్వారా పాల సేకరణను విధానాన్ని ప్రారంభించారు సీఎం జగన్. అయితే ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలలో అమూల్ పాలసేకరణ కొనసాగుతుంది. ఇక సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.…