Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Ys Jagan Launches Ct And Mri Machines

మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్

Published Date :May 19, 2021 , 2:17 pm
By Manohar
మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి : సీఎం జగన్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. రాష్ట్రంలోని 11 టీచింగ్‌ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్‌ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ పరికరాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చి, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు చేయాలనీ అన్నారు. నిర్వహణ వ్యయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ చూసుకుంటుంది. రాబోయే రోజుల్లో అప్‌గ్రేడ్‌తో, ఎప్పటికీ పనిచేసేలా ఈపరికరాలు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తునాం అన్నారు.

ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం, ఒంగోల, నెల్లూరు, కడపల్లో కొత్తగా సీటీ, ఎంఆర్‌ఐ పరికరాలు. ఈ పరికరాలకు 3 సంవత్సరాల వారెంటీ ఉంటుంది, మరో 7 ఏళ్లపాటు నిర్వహణను కంపెనీలు నిర్వహిస్తాయి. మిగిలిన 7 బోధనాసుపత్రుల్లో ఉన్న పరికరాల అప్‌డేషన్, కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా వీటిని నిర్వహిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా మరో అడుగు, అలాగే నాడు – నేడు ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బంది, ఆశ వర్కర్లు, వాలంటీర్లు కోవిడ్‌ సమయంలో కష్ట పడుతున్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నా… ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. వీరి సేవలగురించి ఎంత పొగిడినా తక్కువే. అందరి ప్రశంసలు మీకు ఉంటాయి అని జగన్ తెలిపారు.

Also Read

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Add as a preferred
source on google

కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, డీఎంఅండ్‌హెచ్‌ఓలకు కొన్ని సూచనలు చేయదలిచాను. ఫీవర్‌ సర్వే సరిగ్గా చేయలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటన్నారన్న వార్తలు చూశాను. ప్రస్తుత మహమ్మారి ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడిలో ఉన్నారని గుర్తించాలి. మంచిగా వారిచేత పనిచేయించుకోవాలని అధికారులను కోరుతున్నా. నా దగ్గరనుంచి పారిశుద్ధ్య కార్మికుడు వరకూ ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్‌ వల్ల వచ్చే అనూహ్య పరిస్థితులును ఎదుర్కోనే ఒత్తిడిలో ఉన్నారు. రోజుకు 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మన దగ్గర మహానగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలు లేకపోయినా సరే.. మన రాష్ట్రంలో మరణాల రేటు దేశంలోని అన్నిరాష్ట్రాలతో పోలిస్తే.. తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఉద్యోగులంతా బాధ్యతలను చిరునవ్వుతో తీసుకుంటున్నారు కాబట్టి, ఎంత ఒత్తిడి ఉన్నా సరే పనిచేస్తున్నారు సాధ్యం అయ్యింది. ఎవ్వరూ కూడా సహనం కోల్పోవద్దు అని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap cm
  • CT And MRI Machines
  • Jagan Launches CT And MRI Machines
  • ys jagan

తాజావార్తలు

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!

  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..

  • Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!

  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions