మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవర ప్రసాద్ గారు’లో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఒక పెద్ద ట్రీట్ కానుంది. తాజాగా, ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను విక్టరీ వెంకటేష్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. “#మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది…