రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని 26 జిల్లాలు, 40 డిపార్ట్మెంట్ లు పనితీరు, చేయాల్సిన పనులపై సమీక్షించారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎలాంటి ప్రణాళికలతో పని చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది.. ప్రభుత్వం చేసినపాలసీలు, డిపార్ట్మెంట్ ల వారీగా తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.. సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు.. కొన్నింటికి పరిష్కారా దిశగా సూచనలు చేశారు. కొందరు అధికారుల, కొన్ని డిపార్ట్మెంట్…
రాజమండ్రిలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్పై సస్పెండ్ వేటు పడింది.. ఈ నెల 8వ తేదీన నైట్ డ్యూటీలో ఉంటూ అర్ధరాత్రి సమయంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.. అదే సమయంలో స్టేషన్ లో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా మాట్లాడి చెయ్యి పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ ప్రయత్నించినట్టు.. ఆ మహిళా హోంగార్డు ఆరోపిస్తోంది..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు వంకలు, నదలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బెజవాడలో పర్యటించనున్నారు.. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రేపు బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ సందర్భంగా బెజవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.
ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. హైదరాబాద్లో దిగిరానంటున్న టమాటా రేటు.. కర్నూలులో మాత్రం రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. వందకు పైగా పలికిన టమాటా.. ఇప్పుడు రూపాయి కూడా పలకకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటను పారబోసి ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర దారుణంగా పతనమైంది. కిలో రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.