Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టులకు పోలీసుల నోటీసులు
- ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమాల కేసు
- దర్యాప్తులో భాగంగా పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు
- ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ , ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani : ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ , ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పోలీసులు జయసుధ , మానస తేజను త్వరగా హాజరయ్యేందుకు నోటీసులు జారీ చేశారు. వారు మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్కు వచ్చి వాస్తవాల గురించి వివరించాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని సూచించారు.
Nizamabad: బంగారు నాణేల పేరుతో రూ.7లక్షలు కాజేసిన కేటుగాడు..
ఈ కేసు నేపథ్యంలో, కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం మాయమైందని అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని చిక్కుకున్నారు. వారి సతీమణి జయసుధ , ఆమె పీఏ మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో, నాని సతీమణి జయసుధ పేరు మీద గోడౌన్ నిర్మించి, సివిల్ సప్లైస్కు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, పేదలకు కేటాయించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారం మీద పేర్ని నాని పై అధికార దుర్వినియోగం ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది, , పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!