2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చ
- భారత జట్టుకు రోహిత్, కోహ్లీ ముఖ్యం
- రాబోయే రోజుల్లో రో-కో ఎక్కువ వన్డేలు ఆడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Kaif Slams BCCI: టీమిండియా సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చల మధ్య మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల హిట్మ్యాన్ను ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్టర్లు ఉన్నారనే వార్తలు రావడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఆ వార్తలను ఖండిస్తూ.. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్కు చివరిది కాదని స్పష్టం చేశారు.
క్రిక్బజ్లో జరిగిన చర్చలో మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ… ‘2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. అక్కడి బౌన్సీ పిచ్లు, భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులు జట్టులో తప్పనిసరిగా ఉండాలి. యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నప్పటికీ.. పెద్ద టోర్నీల్లో అనుభవం ఎంత కీలకమో అందరికీ తెలుసు. అందుకే రాబోయే రోజుల్లో వీరిద్దరూ ఎక్కువ వన్డేలు ఆడి మంచి ఫామ్లో ఉండాలి. బీసీసీఐ సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఓసారి పరిశీలించాలి’ అని కోరాడు.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
టీమిండియాలో రోహిత్, విరాట్ ప్రాధాన్యతను వివరించే క్రమంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని కైఫ్ ఉదాహరించాడు. ‘మెస్సీకి 39 ఏళ్లు వచ్చినా అతడి అనుభవమే అర్జెంటీనాకు అతిపెద్ద బలం. సెమీఫైనల్లో గోల్ చేయకపోయినా అసిస్ట్ ఇచ్చి జట్టును ముందుకు నడిపించాడు. యువ ఆటగాళ్లు మ్యాచ్ను ముగిస్తే.. అనుభవజ్ఞులు వారికి సరైన మార్గనిర్దేశం చేస్తారు. అర్జెంటీనాకు మెస్సీ ఎంత ముఖ్యమో.. భారత జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అంతే ముఖ్యం’ అని కైఫ్ చెప్పాడు.
క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా పెద్ద టోర్నీల్లో అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని కైఫ్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో విజయవంతం కావాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. రో-కోలు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లు అని, ఇద్దరు 2027 ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు కీలక బలంగా కొనసాగాలని కైఫ్ కోరాడు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!