Minister Narayana: మున్సిపాలిటీ అనుమతి ఇస్తే చాలు.. ఇక, ఏ పర్మిషన్ అవసరం లేదు..
- 5 అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు..
- ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చన్న మంత్రి నారాయణ..
- లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే చాలా..
- అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని అభివృద్ధి కోసం 62,000 కోట్ల ప్రాజెక్టు చూపట్టాం.. అందులో రాష్ట్ర కేబినెట్ రూ.45 వేల కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇక, 2014-19లో మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతం అని అభివర్ణించిన ఆయన.. ప్రస్తుతం ఖాజానా ఖాళీగా ఉందని విమర్శించారు.. ప్రస్తుతం కాంట్రాక్టర్లు వర్క్స్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు.. అయితే, ఏప్రిల్ మొదటి వారం నుండి అభివృద్ధి నిధులు మున్సిపాలిటీలకే కేటాయిస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో ఉన్న 163 మున్సిపాలిటీలకు రోజుకు 135 లీటర్స్ మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. వీలైంత త్వరగా డీపీఆర్, టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది మెప్మా సభ్యులు ఉన్నారు.
Read Also: Kia Syros EV: కియా సిరోస్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్.. గొప్ప ఫీచర్లతో 2026లో లాంచ్..!
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
ఇక, టౌన్ ప్లానింగ్ విభాగం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మంత్రి నారాయణ.. ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్న ఆయన.. ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు, విశాఖ పట్టణంలో 1200 టన్నుల వ్యర్ధాలతో నూతన ప్లాంట్ ఏర్పాటు చేసి విజయం సాధించాం. టిడ్కో గృహ నిర్మాణంలో ఆధునిక టెక్నాలాజీ వినియోగించి గృహ నిర్మాణాలు చేపట్టాం. దేశంలోని పలు రాష్ట్రాలు మన నిర్మాణ శాంకేతికతను అమలు చేస్తున్నాయి. అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేయాలి. ముఖ్యంగా తాగునీరు, మురు గునీరు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని సూచించారు.. అయితే, గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!