Minister Narayana: మున్సిపాలిటీ అనుమతి ఇస్తే చాలు.. ఇక, ఏ పర్మిషన్ అవసరం లేదు..
- 5 అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు..
- ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చన్న మంత్రి నారాయణ..
- లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే చాలా..
- అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: రాజధాని అభివృద్ధి కోసం 62,000 కోట్ల ప్రాజెక్టు చూపట్టాం.. అందులో రాష్ట్ర కేబినెట్ రూ.45 వేల కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇక, 2014-19లో మున్సిపల్ శాఖ పనితీరు అద్భుతం అని అభివర్ణించిన ఆయన.. ప్రస్తుతం ఖాజానా ఖాళీగా ఉందని విమర్శించారు.. ప్రస్తుతం కాంట్రాక్టర్లు వర్క్స్ చేయడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు.. అయితే, ఏప్రిల్ మొదటి వారం నుండి అభివృద్ధి నిధులు మున్సిపాలిటీలకే కేటాయిస్తామని ప్రకటించారు.. రాష్ట్రంలో ఉన్న 163 మున్సిపాలిటీలకు రోజుకు 135 లీటర్స్ మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. వీలైంత త్వరగా డీపీఆర్, టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది మెప్మా సభ్యులు ఉన్నారు.
Read Also: Kia Syros EV: కియా సిరోస్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్.. గొప్ప ఫీచర్లతో 2026లో లాంచ్..!
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
ఇక, టౌన్ ప్లానింగ్ విభాగం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మంత్రి నారాయణ.. ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్న ఆయన.. ఆన్లైన్లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.. మరోవైపు, విశాఖ పట్టణంలో 1200 టన్నుల వ్యర్ధాలతో నూతన ప్లాంట్ ఏర్పాటు చేసి విజయం సాధించాం. టిడ్కో గృహ నిర్మాణంలో ఆధునిక టెక్నాలాజీ వినియోగించి గృహ నిర్మాణాలు చేపట్టాం. దేశంలోని పలు రాష్ట్రాలు మన నిర్మాణ శాంకేతికతను అమలు చేస్తున్నాయి. అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు పూర్తి చేయాలి. ముఖ్యంగా తాగునీరు, మురు గునీరు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని సూచించారు.. అయితే, గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!