Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
ఏపీలో మళ్లీ ప్రమాణాల లోల్లి… ప్రమాణానికి సిద్దమైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే…
గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్మహ్మానాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవీపై ఆరోపణలు చేశారు. జీవీ స్వచ్చంధ సంస్థకు ఎన్నారై నిధులు వస్తున్నాయని ఆరోపించారు. దీనిపై జీవీ ఘాటుగా స్ఫందించారు. తన సంస్థకు ఎలాంటి ఎన్నారై నిధులు రావడంలేదని తాను కొటప్పకొండలో ప్రమాణం చేస్తానని అన్నారు. జీవీ ప్రమాణంపై పోలీసులు స్పందించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరూ కూడా బయటకు వెళ్లేందుకు వీలులేదని జీవీకి… -
బాబు అప్పుడు విజయవాడకు.. ఇప్పుడు హైదరాబాద్కు పారిపోయారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్పట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని.. సినిమా డైరెక్టర్లను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్రబాబేన్న ఆయన.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడంతో.. మళ్లీ హైదరాబాద్ కు పారిపోయారని ఎద్దేవా చేశారు.. ఇక, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు… -
ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ సర్కార్ సీరియస్
కరోనా కష్టకాలం కనీసం మానవత్వాన్ని చూపకుండా.. అందినకాడికి దండుకునే దందా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. తప్పిదాలకు పాల్పడిన ప్రైవేట్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. ఇప్పటికే నిబంధనలు పాటించని చాలా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం.. ఫైన్లు కూడా వేశామన్నారు.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ డబ్బులు… -
ఆనందయ్య మందు తీసుకున్నవారు ఎవరూ చనిపోలేదు..!
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు… -
ఏపీ కరోనా అప్డేట్… వందకుపైనే మృతులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,167 మందికి పాజిటివ్గా తేలింది.. అయితే, మరోసారి మృతుల సంఖ్య వంద దాటింది.. తాజాగా 104 మంది కరోనాతో మృతిచెందారు.. చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖలో 11, అనంతపూర్లో తొమ్మి ది, నెల్లూరులో తొమ్మి ది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు… -
అమూల్కి ఏపీ డెయిరీ ఆస్తులు..! కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సర్కార్
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్కు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కాగా… ఇవాళ విచారణ సందర్భంగా.. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరింది ఏపీ ప్రభుత్వం.. దీంతో.. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఇక, పాడి రైతుల తరుపున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తామని హైకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లగా.. ఆ అభ్యర్థనను… -
టెన్త్, ఇంటర్ పరీక్షలు తప్పనిసరి..!
కరోనా వైరస్తో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్న ఆయన.. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని… -
ఏపీలో 42 ఆక్సిజన్ ప్లాంట్స్.. హైకోర్టు తెలిపిన కేంద్రం
జూన్ మొదటి వారంలోగా ఆంధ్రప్రదేశ్లో 42 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. కోవిడ్ కేసులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్న పిటిషన్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత ఉందని.. ఇప్పటి వరకు 4 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కొనుగోలుకి సిద్ధంగా దరఖాస్తు చేశామని కోర్టుకు విన్నవించింది ప్రభుత్వం. గ్రామ… -
కరోనా నివారణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..
ఆంధ్రప్రదేశ్లో కరోనా నివారణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన జీఎంవో సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్… -
నేడు ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టులో విచారణ…
ఆనందయ్య తయారు చేసిన మందు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆనందయ్య మందు కరోనాకు పని చేస్తుందని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన మందుకు డిమాండ్ పెరిగింది. ఇక ఈ మందుపై ప్రస్తుతం విజయవాడ ఆయుర్వేద పరిశోధనసంస్థ, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల పరిశోధన చేస్తున్నాయి. 570 మంది నుంచి వివరాలు సేకరించి పరిశోధన చేశారు. ఈ నివేదికను సీసీఆర్ఏఎస్కు సమర్పించారు. సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతులు వస్తే ఆనందయ్య మందు తయారు…
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!