మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది… ఇక, మరోసారి అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికం… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామన్న ఆయన.. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది… రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించన కేబినెట్.. ఈ మధ్య హాట్ టాపిక్గా మారిన తెలంగాణ-ఏపీ జల వివాదంపై చర్చించింది… తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే సంయమనంతో ఉన్నామని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న సీఎం.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.. ఇక,…
రేపటి నుంచి ఏపీలో ఆంక్షలను సడలించబోతున్నారు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలలింపు సమయాన్ని పెంచుతూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాజిటివిటీ 5 శాతం కంటే తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో సడలింపుల సమయాన్ని సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచారు. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. జులై 1 నుంచి 7 వరకు సడలించిన…
కృష్ణానది యాజమాన్య బోర్డు కమిటీ.. రేపటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది… నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు బుధవారం రోజు కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే, మంగళవారం సాయంత్రం వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… పరిశీలన వాయిదా వేశారు.. ఇక, జూలై 3వ తేదీన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది…
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ముగిసిన థియేటర్ల ఓపెనింగ్స్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు అవుతుండగా.. విడుదలకు రెడీగా వున్నా సినిమాలు థియేటర్లపై దూకేందుకు వెనకడుగు వేస్తున్నాయి. విడుదల తేదీలను సైతం ప్రకటించేందుకు సిద్దపడట్లేదు. తెలంగాణలో తెరలు తెరిచేందుకు పర్మిషన్ ఉండగా.. ఏపీలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నారు. అయితే జులై లోనైనా పరిస్థితులు మారుతాయని అనుకొనే…
సింహాచలం భూముల్లో జరిగిన అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సింహాచలం దేవస్థానానికి గతంలో ఈవోగా పని చేసిన రామచంద్ర మోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు దేవదాయ శాఖ కమిషనర్.. సింహాచలం దేవస్థానం రికార్డుల్లో నుంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్పై అభియోగాలున్నాయి… ప్రస్తుతం దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్-2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్రమోహన్.. సర్కార్కు సరెండర్ చేశారు.. అయితే, ఈ వ్యవహారంలో విచారణ పారదర్శకంగా జరిగేందుకే రామచంద్రమోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు చెబుతున్నారు.…
జర్నలిస్టులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలో రాష్ట్రంలోని 25 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఇవాళ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమావేశమైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు… వార, పక్ష, మాస పత్రికలకు సర్క్యులేషన్ బట్టి అక్రిడేషన్లు కేటాయించాలని తెలిపారు. దీంతో.. అక్రిడేషన్ల కోసం ఎదురుచూస్తోన్న…
అమరావతి : అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు, రీ-సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీలో సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, సీఎం ముఖ్య సలహాదారు సజ్జల భేటీ అయ్యారు. అంతేకాదు… ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, ఎమ్మెల్యేల నుంచి సమావేశంలో అభిప్రయాలు, సూచనలు తీసుకున్నారు ధర్మాన, సజ్జల. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీలు పునరుద్దరించే అంశంపై కీలక సమీక్ష…