Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రెస్ మీట్ – Live
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో… -
ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలి : విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. read also : తెలంగాణ… -
తాడేపల్లిలో టెన్షన్… సీఎం నివాసం ముట్టడికి విద్యార్ధుల యత్నం…
తాడేపల్లిలో సిఎం వైఎస్ జగన్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. జాబ్ క్యాలెండర్కు నిరసనగా విద్యార్ధి సంఘాలు ఛలో తాడేపల్లి కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇంటిని ముట్టడికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నం చేశాయి. సీఎం వైఎస్ జగన్ నివాసం వైపు వెళ్లేందుకు టీఎన్ఎస్ఎఫ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్యకర్తలకు మద్య తోపులాట జరగింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సీఎం నివాసం వద్ద పోలీసులు భారీగా… -
నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు
నేటి నుండి ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు సదరం క్యాంపులు ఏర్పాటు చేయనుంది జగన్ సర్కార్. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటలకే సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి స్లాట్ల బుకింగ్ మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్నది. అటు దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. read also : ఇండియా కరోనా… -
నేడు ఏపీ సీఎం పోలవరం పర్యటన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు పోలవరం చేరుకుంటారు. ఉదయం 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సీఎం జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. గత కొన్ని రోజులుగా… -
పెట్రోల్ ధరలను మోడీ గడ్డంతో లింకుపెట్టిన నారాయణ…
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు ధరలు పైపైకి పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక, ప్రతిపక్షాలు పెట్రోల్ ధరలను నిరసిస్తూ నినాదాలు, నిరసలు చేస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ సీపీఐ తిరుపతిలో నిరసన తెలియజేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నారాయణ పాల్గోన్నారు. ఓ పెట్రోల్ బంకు వద్ద షర్టు విప్పేసి నిరసన చెప్పడమే కాకుండా ప్రధాని మోడీపైన, రాష్ట్రప్రభుత్వంపైన విమర్శలు సంధించారు. పెట్రోల్ ధరలు మోడీ గడ్డం పెరిగినట్టుగా పెరుగుతున్నాయని… -
గెజిట్తో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు ?
తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి.… -
తెరపైకి మళ్లీ ప్రత్యేక హోదా అంశం… పార్లమెంట్లో ఆందోళనకు వైసీపీ సిద్ధం…
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు అఖిలపక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై సుమాలోచనలు జరిపారు. అదేవిధంగా సభను సజావుగా జరిగేలా సహకరించాలని ప్రభుత్వం సభ్యులను కోరింది. ఈ సమావేశం అనంతరం వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి… -
రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ఇక సీఎం జగన్ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.10 గంటల నుంచి 12…
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!