Congress: పుతిన్కు రాష్ట్రపతి విందు.. శశి థరూర్కు ఆహ్వానంపై కాంగ్రెస్ గరం గరం..
- కాంగ్రెస్ పార్టీలో విభేదాలు..
- శశి థరూర్ వ్యవహారంపై గరం గరం..
- పుతిన్ డిన్నర్కు థరూర్కు ఆహ్వానం..
- రాహుల్, ఖర్గేలను పట్టించుకోని కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్కు ఆహ్వానం అందింది. అదే సమయంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను కేంద్రం పట్టించుకోలేదు. విందు ఆహ్వానాన్ని శశి థరూర్ అంగీకరించారు. తాను పుతిన్ డిన్నర్కు హాజరవుతానని చెప్పారు.
Read Also: Off The Record: అంబటి రాంబాబు మీద డస్ట్ బిన్ బాంబ్ పడబోతుందా? జైలుకు పంపబోతున్నారా?
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇదిలా ఉంటే, ఇప్పుడు థరూర్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ గరం గరం అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ.. జరుగుతున్న ‘‘ఆట’’ గురించి థరూర్కు తెలియదా.? అని ప్రశ్నించారు. ‘‘ కాంగ్రెస్ నాయకుల్ని ఆహ్వానించకుండా, తనను ఆహ్వానిస్తున్నారంటే ఆట ఎందుకు ఆడుతున్నారో, ఎవరు ఆడుతున్నారో, మనం దాంట్లో భాగం కాకూడదో అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.
గురువారం పుతిన్ రాకకు ముందు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ, విదేశీ అతిథులు ప్రతిపక్షాల నేతల్ని కలవనీయకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. గతంలో ఈ సంప్రదాయం ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ ఎంపీ థరూర్ని ఆహ్వానించి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని, ఖర్గేని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!