అసలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు… ప్రస్తుతం తెలంగాణలో మాజీ మంత్రి ఈటల వ్యవహారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, కోవిడ్ సమయంలో.. ఈ పరిస్థితి ఏంటి? అంటూ రెండు ప్రభుత్వాలను నిలదీశారు వీహెచ్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ మీద పెడుతున్న శ్రద్ధ.. కరోనా మహమ్మారి కట్టడిపై ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాళ్ల మీద విచారణకు ఇది సమయం కాదన్న ఆయన.. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ల పై విచారణ జరపొచ్చు.. కానీ, పోయే ప్రాణాలు రేపటి వరకు ఆగవు కదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కరోనా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని సూచించిన వీహెచ్.. ప్రజల ప్రాణాలు కాపాడాలి.. కోవిడ్ బాధితులు స్మశానంలో ఉంటున్నారని వచ్చిన ఓ వార్త హృదయ విదారకరంగా ఉన్నాయన్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో.. గ్రామాల్లో, మండలాల్లో ఫంక్షన్ హాళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చే ఆలోచన చేయాలని సూచించారు వీహెచ్.
Also Read
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!