ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్… అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకుని వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు.. కాగా, 2019లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రాజ్యాంగ సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు,…
ఓవైపు విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల ఇన్సైడ్ట్రేడిరగ్ జరిగిందనే ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయనే ప్రచారం జరుగుతున్నా వాస్తవంలో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై దాఖలైన ఎఫ్ఐఆర్ వాజ్యం సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే తేలవలసి వుంది. జులై 13న సుప్రీం కోర్టులో జస్టిస్ వినీత్ శరణ్, దినేశ్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసు మంచి చెడ్డలతోపాటు ఎక్కడ విచారణ జరగాలనేదానిపైనా…
ఆయనో యువ ఎమ్మెల్యే. రాజకీయ ఉద్ధండులకు దక్కని అవకాశం లభించింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సాధించామని సంబరాలు చేసుకుంది ఎమ్మెల్యే వర్గం. అంతా ఓకే అనుకున్న వేళ కిరికిరి మొదలైంది. దీంతో ఉపేక్షించకూదని భావిస్తున్న ఆ యువ ఎమ్మెల్యే.. తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. అట్టహాసంగా మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన విశాఖ జిల్లా రాజకీయాల్లో అనకాపల్లిది సెపరేట్ స్టైల్. ఇక్కడ పాలిటిక్స్ అన్నీ సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంటాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రులు కొణతాల…
టిడిపి సీనియర్ ఎంఎల్ఎ, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ ఎపి ఆర్థిక నిర్వహణలలో 41వేల కోట్ల మేరకు అవకతవకలు జరిగాయని గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్కులేఖ రాశారు. కాగ్ తరపున లతామల్లికార్జున్ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రావత్కు చాలా కాలం కిందటే రాసిన లేఖను తన ఫిర్యాదుతో జతచేశారు. ఈ 41 కోట్ల మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, రశీదులు వివరాలు లేవనిఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశలో కేంద్రం ఎపి ప్రభుత్వానికి రాసిన లేఖ ఒకటి…
కొత్త 104 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 539… 104 అంబులెన్స్ వాహనాలను కొనుగోలు చేయనున్నారు.. రాష్ట్రంలోని ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ 104 అంబులెన్సు వాహనాన్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. రూ. 89.27 కోట్లతో 104 అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేయనున్నారు.. ఏడాదికి రూ. 75.82 కోట్ల మేర ఈ వాహనాలపై వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం… గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామ్లీ విధానం…
పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్ జగన్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్ని…
ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్ను స్పీకర్కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యగా ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది స్పష్టంగా సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 290 పేజీలతో…
ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,763 శాంపిల్స్ పరీక్షించగా.. 2,567 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. తాజా మృతుల్లో గుంటూరులో నలుగురు, చిత్తూరు, నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇక, ఇదే…