తూ.గోదావరి జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ సంఖ్యకు ఐదింతలు అధికంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారందరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వాయిస్… గత ఐదేళ్ల నుంచే తూ.గోదావరి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2017లో 336 కేసులు నమోదు కాగా, 2018లో 170, 2019లో 545 కేసులు నమోదయ్యాయి. 2020లో 575 కేసులు వెలుగుచూశాయి. 2021లో ఇప్పటి వరకూ 36 కేసులు నమోదైనట్లు అధికారులు తేల్చారు. కేవలం 2 నెలల్లో వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నా.. అధికారులు సక్రమంగా స్పందించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 11 మండలాల పరిధిలో ఏటా డెంగ్యూ, మలేరియా కేసులు నమోదువుతున్న గుర్తించారు అధికారులు. ఇళ్లలోని గోడలకు దోమల నివారణ మాత్రమే పిచికారీ చేశారు. రెండో దశ చేయాల్సి ఉంది. కేసులు ఎక్కువగా నమోదైన 20 గ్రామాలు, 10 పట్టణాలను గుర్తించారు. అయితే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లోని కుటుంబాలకు 3లక్షల 79వేల 300 రూపాయల ఖర్చుతో దోమతెరలను అందజేశారు అధికారులు. జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
గ్రామీణ ప్రాంతాల్లో ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధికి కారకమైన టైగర్ దోమల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి 11తేదీ వరకు డెంగ్యూ మాసోత్సవాల పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!