తూ.గోదావరి జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో డెంగ్యూ జరాలు భయపెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అధికారికంగా 36 కేసులు నమోదయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రైవేటు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారితో ఈ సంఖ్యకు ఐదింతలు అధికంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాజమండ్రి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారందరికీ ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వాయిస్… గత ఐదేళ్ల నుంచే తూ.గోదావరి జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. 2017లో 336 కేసులు నమోదు కాగా, 2018లో 170, 2019లో 545 కేసులు నమోదయ్యాయి. 2020లో 575 కేసులు వెలుగుచూశాయి. 2021లో ఇప్పటి వరకూ 36 కేసులు నమోదైనట్లు అధికారులు తేల్చారు. కేవలం 2 నెలల్లో వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నా.. అధికారులు సక్రమంగా స్పందించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 11 మండలాల పరిధిలో ఏటా డెంగ్యూ, మలేరియా కేసులు నమోదువుతున్న గుర్తించారు అధికారులు. ఇళ్లలోని గోడలకు దోమల నివారణ మాత్రమే పిచికారీ చేశారు. రెండో దశ చేయాల్సి ఉంది. కేసులు ఎక్కువగా నమోదైన 20 గ్రామాలు, 10 పట్టణాలను గుర్తించారు. అయితే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లోని కుటుంబాలకు 3లక్షల 79వేల 300 రూపాయల ఖర్చుతో దోమతెరలను అందజేశారు అధికారులు. జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
గ్రామీణ ప్రాంతాల్లో ఎఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు డెంగ్యూపై అవగాహన కల్పిస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో డెంగ్యూ వ్యాధికి కారకమైన టైగర్ దోమల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి 11తేదీ వరకు డెంగ్యూ మాసోత్సవాల పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..