ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ? కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి! వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి..…
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో 1859 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,88,910కి చేరింది. ఇందులో 19,56,627 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,688 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 13 మంది మృతిచేందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,595 మంది మృతిచెందారు. ఇక…
ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం వెయ్యి వరకు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతున్నది. ఆగస్ట్ 14 వ తేదీతో నైట్కర్ఫ్యూ పూర్తవుతుంది. 14 తరువాత కర్ఫ్యూను పొడిగించే ఆలోచనలే ఏపీ ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తోంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి స్కూళ్లను తిరిగి ప్రారంభించబోతున్నారు. స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తే నైట్ కర్ఫ్యూ అమలు చేయడం కుదరనిపని. ఇకవేళ పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేయడం వలన ఇబ్బందులు కూడా రావొచ్చు. నైట్ కర్ఫ్యూని ప్రణాళికా…
కేంద్ర హోంమంత్రి అమిత్షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు… ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన.. ఆ తర్వాత హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకున్నారు.. అక్కడ షాకు ఘనస్వాగతం లభించింది.. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఇక, ఆ తర్వాత శ్రీశైలం…
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష కార్యక్రమంపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధానంలో ముందుకు సాగాలని… అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన మేరకు డ్రోన్లు కొనుగోలు చేయాలని… అవసరమైన సాఫ్ట్వేర్ను తీసుకోవాలని తెలిపారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని…ప్రతి నాలుగు వారాలకు…
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం… త్వరలోనే ఎన్జీటీ, కేంద్రానికి దీనిపై నివేదిక సమర్పించనున్నారు.. మరోవైపు.. లేఖలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది… ఇశాళ కేఆర్ఎంబీ చైర్మన్కు లేఖరాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ సి. మురళీధర్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని లేఖలో పేర్కొన్నారు మురళీధర్.. మరి తెలంగాణ…
నేతల క్రిమినల్ రికార్డులపై రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా ఉందని.. అందుకే సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతిని కలిసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ నిబంధనలతో వైరస్ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ…
మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పులు జరపడం.. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో.. చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి… అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు… అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్మెన్లు కూడా ఉన్నట్టుగా…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో షా పూజలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్కు చేరుకోనున్నారు. 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి., అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25కు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అక్కడి…