ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీనో.. సొంత వ్యాపార కార్యకలాపాల్లోనూ అంతే బిజీగా ఉంటారట. దాంతో నియోజకవర్గంలో ప్రజలకు చిక్కరు.. దొరకరనే ముద్ర పడిపోయింది. ఎవరా మంత్రి? ఆత్మకూరులో మంత్రి చిక్కరు.. దొరకరు..? మేకపాటి గౌతంరెడ్డి. ఏపీ మంత్రి. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సీఎం జగన్కు సన్నిహితమనే ముద్ర ఉంది. మేకపాటి కుటుంబానికి సొంత వ్యాపారాలు ఎక్కువే. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి రెండోసారి గెలిచిన గౌతంరెడ్డి తమ…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో పర్యటిస్తున్న ఆయన.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం తెలంగాణలో ఆయన పర్యటన కొనసాగుతుండగా… త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో సీజేఐ పర్యటన కొనసాగనుంది.. సీజేఐగా తొలిసారి తన స్వగ్రామంలో అడుగుపెట్టనున్నారు.. Read Also: దళితబంధు లబ్ధిదారులకు గుడ్న్యూస్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ 3 రోజుల పాటు పర్యటించనున్నారు.. ఈ…
ఆ జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే. కాకపోతే.. ఒకరంటే ఇంకొకరికి పడదు. పైకి నవ్వుతారు.. తెరవెనక కత్తులు దూసుకుంటారు. ఎప్పుడు కలిసి పోతారో తెలియదు.. ఎందుకు విడిపోతారో కూడా గుర్తించలేం. ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ జరుగుతోంది. అదే పార్టీలో పెద్ద చర్చ…రచ్చ..! పార్టీని బలహీనపర్చడానికే నేతలు కష్టపడుతున్నారా? టీడీపీలో క్రమశిక్షణ కనుమరుగవుతోందా? ఒక్క సీటూ గెలవలేని జిల్లాలో ఎవరేం చేసినా అధిష్ఠానానికి…
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి…
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా సంభవించిన వరదలతో చాలామంది నష్టపోయారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 20న తిరుపతిలో పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కాగా వరదల్లో మృతి చెందిన 48 మంది…
విశాఖ జిల్లాలో నాలుగు థియేటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అధికారులు. టిక్కెట్ ధరలు పెంచినట్టు గుర్తించడంతో యాజమాన్యాలను వివరణ కోరింది యంత్రంగం. ఈ రకమైన ఫిర్యాదులు తొమ్మిది సినిమాహాళ్లపై రావడంతో… థియేటర్ల నిర్వహణ, టిక్కెట్ ధరలు,లైసెన్సులపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అయితే సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు…
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తనలో మరో టాలెంట్ను బయటపెట్టారు. తన కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఇటీవల హైదరాబాద్లో మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ సతీమణి భారతి సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సాహపరిచేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన కుమార్తెతో కలిసి డ్యాన్స్ వేశారు. Read Also:…
ఈ నెలలో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి పండుగలను రానున్నాయి… సంక్రాంతి పండుగ అంటే తెలుగు లోగిళ్లలో సందడి వాతావరణం నెలకొంటుంది.. పట్టణాలను వదిలి.. అంతా పల్లెబాట పడతారు.. దీంతో.. అసలైన పండుగ గ్రామాల్లోనే కనిపిస్తోంది.. ఇక, క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల 23 నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానుండగా.. జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు మొదలుకానున్నాయి.. క్రిస్మస్ సెలవులు ఈ నెల 23 నుంచి 30వ…
✍ నేడు అన్నవరం సత్యనారాయణస్వామికి కోటి తులసి దళార్చన.. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా స్వామివారికి కోటి తులసి దళార్చన✍ నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన… మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మనవడు వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న చంద్రబాబు✍ తిరుపతి: నేడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీ జాతీయ సదస్సు✍ నేడు వరంగల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. కోర్టు కాంప్లెక్స్, నల్సార్ యూనివర్సిటీలో బాలుర, బాలికల హాస్టళ్లను ప్రారంభించనున్న సీజేఐ,…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇవాళ 31,855 శాంపిల్స్ పరీక్షించగా.. 137 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 189 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,60,653 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్…