ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదానికి తెర దించేందుకు రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.. సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయనను కలిసినట్టు.. చాలా మంచి వాతావరణంలో సమావేశం జరిగింది.. సమస్యలు అన్నీ సమసిపోతాయనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు చిరంజీవి.. ఇదే సమయంలో.. ఇది ఇద్దరి భేటీయే కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఇక, ఈ భేటీపై తనదైన శైలిలో స్పందించారు సీపీఐ జాతీయ నేత నారాయణ.. చిరంజీవి,…
1) తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. 2) సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో…
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి…
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో శవరాజకీయాలు చేసేది చంద్రబాబే నని అది అందరికి తెలుసని చెప్పారు. హత్యారాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందన్నారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబే అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు రాక్షస ఆలోచనలు భోగి మంట్లలో తగలబడాలని కోరుకుంటున్నా అంటూ మంత్రి వెల్లంపల్లి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. Read Also: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ .. ఐదు…
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లెటూళ్లలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారో వాటిని అన్నింటినీ తాడేపల్లి…
గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం రాత్రి నుంచి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం మాయమైంది. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను పక్కపక్కనే అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వైఎస్ఆర్ విగ్రహాన్ని మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని అభిమానులు ఆరోపిస్తున్నారు. Read Also: సీఎం జగన్తో చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామం: ఎమ్మెల్యే రోజా ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు…
కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను…
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు కలకలం సృష్టించింది.. అయితే, హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.. మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివ రామయ్య…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి…