Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
ఉద్యోగులకు షాక్.. ఎస్మా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని గనుల శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖలో ఎవరైనా ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా.. బంద్ చేసినా.. ఆందోళనలకు దిగినా ఎస్మా చట్టం ప్రకారం… -
మా సమస్యలు పరిష్కరించండి.. సజ్జల కాళ్లపై పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు..
ఆంధ్రప్రదేశ్లో సమ్మెబాట పడుతోన్న ఉద్యోగులను ఆపేందుకు సీఎం, మంత్రుల కమిటీ, సీఎస్.. ఇలా అందరూ రంగంలోకి దిగారు.. సమ్మె డెడ్లైన్ ముంచుకొస్తుండడం.. ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతోన్న తరుణంలో.. ఇవాళే ముగింపు పలకాలన్న పట్టుదలతో ఉంది ప్రభుత్వం.. మరోవైపు.. తమ సమస్యల్ని కూడా పరిష్కరించాలంటున్నారు ఔట్సోర్కింగ్ ఉద్యోగులు.. ఇవాళ ఏకంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్లపై పడడం చర్చగా మారింది.. స్టీరింట్ కమిటీ సమావేశం కోసం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చారు.. ఈ సమయంలో.. తమ… -
ప్రభుత్వం నుంచి ఇవాళే కీలక ప్రకటన..!
పీఆర్సీ, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది. అయితే, మరోసారి చర్చలు కొనసాగుతున్నాయి.. దీంతో.. కార్మికుల సమ్మె డెడ్లైన్ కంటే ముందే.. ఈ వ్యవహారానికి పులిస్టాట్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, పట్టువిడుపులకు మేం కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయన్న ఆయన… కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేం… -
త్వరలోనే ఏపీలో కరెంట్ కష్టాలు తీరతాయి: విజయసాయిరెడ్డి
ఏపీలో గత మూడు రోజులుగా కరెంట్ కష్టాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరెంట్ కోతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో కరెంట్ కష్టాలు త్వరలో తీరనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. Read Also: సీఎం జగన్ తో ముగిసిన మంత్రుల కమిటీ భేటీ కరెంట్ కష్టాలపై రాజ్యసభలో తాను… -
ఉద్యోగుల సమ్మె, పెన్డౌన్.. హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యవహారం కాస్త ముదిరి.. సమ్మెకు దారి తీస్తోంది.. ప్రభుత్వం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుంటే.. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన ఉద్యోగులు.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. అయితే, ఉద్యోగుల సమ్మె, పెన్డౌన్, ర్యాలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్లను లంచ్ మోషన్గా స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.. చట్టవిరుద్ధంగా ఏం జరిగినా దానిని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు… -
కరోనా అప్డేట్.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, గత బులెటిన్తో పోలిస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో… -
ఎస్మాపై ప్రభుత్వం కసరత్తు.. ఈ రంగాలవారే టార్గెట్..!
ఓవైపు చర్చలకు ఎప్పుడైనా సిద్ధం అంటూనే.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండడంతో.. కఠిన చర్యలకు అయినా వెనుకాడేది లేదనే యోచనలో ప్రభుత్వం ఉంది.. రాష్ట్రంలో ఎస్మా ప్రయోగించటానికి ఉన్న అవకాశాలపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఏం చేద్దాం.. ఎలాంటి చర్యలు తీసుకుందాం..? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.. మంత్రులు బుగ్గన, బొత్స, సలహాదారు సజ్జలతో ఈ సమావేశం రెండు… -
సజ్జల సీరియస్.. ఉద్యోగులకే నష్టం.. !
పీఆర్సీ ఉద్యమం ఉధృతమైంది.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇప్పటికే పెన్ డౌన్ అంటూ.. ఆందోళనను ఉధృతం చేశారు.. అయితే, ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సీరియస్ గా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మాటలు, వాటికి కౌంటర్లు చేస్తూ వెళితే అసలు సమస్య డైవర్ట్ అవుతుందని.. దీని వల్ల ఉద్యోగులకే నష్టం అన్నారు.. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదన్న ఆయన.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత… -
రోజా తీవ్ర అసంతృప్తి..! అవసరమైతే రాజీనామాకు సై..
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా,… -
కేసీఆర్పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్.. ఈ మధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేపల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్పై విరుచుకుపడ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం…
తాజావార్తలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..