వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, సీఐడీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17న విచారణకు హాజరవుతానన్న ఆయన.. నేను చట్టాలను అనుసరిస్తాను… గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తి గతంగా దాడి చేశారు.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాను అన్నారు. ఇక, సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది.. అంటూ మండిపడ్డ ఎంపీ.. ఇదంతా చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనంద పడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
12 ఆఫ్ 2021 కేసులో నాకు నోటీసులు ఇచ్చారు.. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజా ద్రోహం కేసులు పెడతారా…? అని ప్రశ్నించారు ఎంపీ రఘురామ.. వ్యక్తి గత కక్షలో భాగంగా నాకు నోటీసులు ఇచ్చారు అని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ పేదలకు భూములు ఇస్తున్నట్లు నిన్న బ్రోచర్ విడుదల చేసారు… రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు అని సెటైర్లు వేశారు.. 175 నియోజకవర్గాల్లో జగన్ అన్న ఇల్లులు ఇస్తాడట.. రోడ్లు వేయడానికి డబ్బులు ఉండవు.. కానీ, ఇల్లులు ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు.. ఇవి మొత్తం దగా లే అవుట్లేనని ఆరోపించిన ఆయన.. ప్రజలందరూ ఆలోచించాలి.. ఇది ప్రజలను మరో మోసానికి పాల్పడుతున్న చర్యలు మాత్రమేనని ఆరోపించారు.. ఇక, ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత నేను ఓ నిర్ణయం తీసుకుంటాను.. ఏపీలో ఉన్న పార్టీలు, ప్రజలందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు.. ఫిబ్రవరి 5వ తేదీ వరకు తాను ఎదురు చూస్తానని తెలిపారు ఎంపీ రఘురామకృష్ణరాజు.