ఏపీ సీఐడీ నోటీసులు.. ఘాటుగా స్పందించిన ఎంపీ రఘురామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, సీఐడీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 17న విచారణకు హాజరవుతానన్న ఆయన.. నేను చట్టాలను అనుసరిస్తాను… గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తి గతంగా దాడి చేశారు.. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాను అన్నారు. ఇక, సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది.. అంటూ మండిపడ్డ ఎంపీ.. ఇదంతా చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనంద పడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..
Also Read
- Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్లకు నారా లోకేష్ దిశానిర్దేశం
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
12 ఆఫ్ 2021 కేసులో నాకు నోటీసులు ఇచ్చారు.. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజా ద్రోహం కేసులు పెడతారా…? అని ప్రశ్నించారు ఎంపీ రఘురామ.. వ్యక్తి గత కక్షలో భాగంగా నాకు నోటీసులు ఇచ్చారు అని ఆరోపించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ పేదలకు భూములు ఇస్తున్నట్లు నిన్న బ్రోచర్ విడుదల చేసారు… రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు అని సెటైర్లు వేశారు.. 175 నియోజకవర్గాల్లో జగన్ అన్న ఇల్లులు ఇస్తాడట.. రోడ్లు వేయడానికి డబ్బులు ఉండవు.. కానీ, ఇల్లులు ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు.. ఇవి మొత్తం దగా లే అవుట్లేనని ఆరోపించిన ఆయన.. ప్రజలందరూ ఆలోచించాలి.. ఇది ప్రజలను మరో మోసానికి పాల్పడుతున్న చర్యలు మాత్రమేనని ఆరోపించారు.. ఇక, ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత నేను ఓ నిర్ణయం తీసుకుంటాను.. ఏపీలో ఉన్న పార్టీలు, ప్రజలందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు.. ఫిబ్రవరి 5వ తేదీ వరకు తాను ఎదురు చూస్తానని తెలిపారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
తాజావార్తలు
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్లకు నారా లోకేష్ దిశానిర్దేశం
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!