వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..? ఎంపీ రఘురామ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో..? అనేది వేచిచూడాల్సిన విషయం. కాగా, గతంలో సీఐడీ విచారణ, అరెస్ట్పై పెద్ద వివాదమే నడిచింది.. ఆయన పాదాలపై మరకల వ్యవహారం చర్చగా మారింది.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
Read Also: సైనాకు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ.. వివాదం ముగిసినట్టేనా..?