ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపణలు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని పట్టాభి ఆరోపించారు. ఈ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని.. ఇవేమీ జగన్ తన జేబులో నుంచి తీసి ఇస్తున్న డబ్బులు కావన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏపీ సర్కారు పక్కదారి పట్టిస్తోందన్నారు. చిక్కీలు సరఫరా చేసే కేంద్ర కంపెనీని దిక్కుమాలిన కారణాలు చెప్పి డిస్ క్వాలిఫై చేశారని పట్టాభి విమర్శించారు.…
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని.. అందుకే లోకేష్ తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ లోకేష్పై…
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వడ్డింపు మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.. గాంధీ చిత్ర పటానికి…
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్టౌన్…
ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు దుండగులు.. తిరుపతి సమీపంలో జనసేన కార్యకర్త సుహాన్ భాషాను అత్యంత కిరాతకంగా నరికి కత్తులతో నరికి చంపారు.. తిరుపతిలోని పేరూరు చెరువు వద్ద భాషాపై దాడి చేసి హతమార్చారు.. మృతుడు గాంధీపురానికి చెందిన సుహానా భాషాగా గుర్తించారు.. సమాచారం అందుకున్న జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.. ఇక, స్థానిక నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుహాన్ భాషాను హత్య చేసి…
✪ నేడు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్న రాజకీయ పార్టీలు✪ నేడు శ్రీకాకుళం శాంతినగర్లో గాంధీ స్మారక మందిరం ప్రారంభం… గాంధీ మందిరంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తివనం ప్రారంభం✪ హైదరాబాద్: ప్రగతిభవన్లో నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్✪ హైదరాబాద్: నేడు డ్రగ్స్ కేసులో రెండో రోజు టోనీని విచారించనున్న పోలీసులు✪ ఢిల్లీ: నేడు లోక్సభ స్పీకర్…
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది.. హైదరాబాద్ నుండి త్రిపురాంతకం వెళ్తుండగా.. మాచర్ల మండలం ఎత్తిపోతల సమీపంలో ప్రమాదం జరిగింది.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేస్తూ వెనుకనుంచి ఢీకొట్టింది మరోకారు.. అయితే, ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయ్యింది.. ఎమ్మెల్యే కారుమూరి సురక్షితంగా బయటపడ్డారు.. మరో వాహనంలో త్రిపురాంతకం వెళ్లిపోయారు…
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలను స్వీకరిస్తోంది.. కొత్త జిల్లా కేంద్రాలు, పేర్లపై పలు విమర్శలు, విజ్ఞప్తులు వస్తున్నాయి.. కొందరి నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.. అయితే, కొత్త జిల్లాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయం అన్నారు.. ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారని మండిపడ్డ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. గత మూడు నాలుగు రోజులుగా మళ్లీ తగ్గుతూ వస్తుంది.. అయినా.. భారీగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,573 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 22,60,181కు చేరుకోగా.. మృతుల సంఖ్య 14,594కి పెరిగింది.. ప్రస్తుతం…
ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెట్టాలని…