తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది. ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం…
ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు…
చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా ఎలా మారుస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మండిపడ్డారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారన్న ఆయన.. 1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదన్నారు.. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చే లేదు.. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా..? పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు…
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా కేంద్రం.. ఏపీకి కేటాయించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు బీజేపీ నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు తమపేర్లు పెట్టుకుని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.. కేంద్రం…
ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లులు కురిపించారన్న ఆయన.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యిందని కేంద్ర మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు.. ఇక, కోనసీమ రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని ప్రకటించిన ఆయన.. అదేవిధంగా కడప-బెంగుళూరుకు రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు…
ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ మధ్య చర్చ హాట్హాట్గా సాగుతోంది.. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మధ్యే జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇక కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉంటాయనేది మరింత స్పష్టం అయ్యింది.. వైఎస్ జగన్ అధికాంరలోకి వచ్చాక తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత.. ఐదేళ్లు పదవులు ఉండబోవని.. మధ్యలోనే మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పారు.. అయితే, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్…
కట్టుకున్న భార్యకు అన్నీ తానై చూసుకోవాల్సిన భర్త సైకో ప్రవర్తనతో.. ఓ ఇల్లాలికి నరకం చూపించాడు.. పెళ్లి జరిగినప్పటి నుంచి వికృత వేధింపులకు పాల్పడ్డాడు.. మౌనంగా దాదాపు రెండేళ్లు ఆ సైకోగాడిని భరించిన ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన పోలయ్య 2020 మార్చి 5వ తేదీన వివాహం చేసుకున్నాడు.. ఇక, కొంతకాలం నుంచి తీవ్ర వేధింపులకు దిగాడు.. ఓ వైపు అనుమానం, వికృత వేధింపులు.…