Home
Andhra Pradesh
Andhra Pradesh News
-
Vijaya Sai Reddy: ముసలాడికి గాలి సోకిందో ఏమో..? చంద్రబాబుపై సాయిరెడ్డి కౌంటర్
ఏపీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న… -
ED Raids: అర్థరాత్రి వరకు జేసీ ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు ఏం జరిగింది..?
అనంతపురం జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి.. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తాడిపత్రితో పాటు హైదరాబాద్లోని జేసీ సోదరుల నివాసాల్లో ఏకకాలం దాడుల నిర్వహించారు ఈడీ అధికారులు.. ఇదే సమయంలో జేసీ సోదరుల ముఖ్య అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ గోపాల్రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.. ఈ సోదాల నేపథ్యంలో వారి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అగ్నిఫత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నేడు అగ్నిపత్ పథకంపై ఇవాళ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష * ఇవాళ, రేపే హైదరాబాధ్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు * నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీడబ్ల్యూసీ బృందం * ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల * అగ్నిపథ్పై ఆందోళనలు, విధ్వంసం నేపథ్యంలో బీహార్లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ * నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, నాగర్ కర్నూల్,… -
RBI Report: దేశంలో అప్పుల భారం ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ
దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రకటించింది. దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని ఆర్బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్డీపీలో… -
Love Marriage: మరో ‘పడమటి సంధ్యారాగం’.. ఒక్కటైన ఏపీ అబ్బాయి, అమెరికా అమ్మాయి
ప్రేమకు ఎల్లలు లేవంటారు.. హద్దులు లేవంటారు. అందుకే ఎవరు ఎవరి ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఉదాహరణకు మీకు లేడీ సూపర్స్టార్ విజయశాంతి నటించిన పడమటి సంధ్యారాగం సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో విజయశాంతి అమెరికాకు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తాజాగా అచ్చం ఇదే తరహాలో ఏపీకి చెందిన ఓ అబ్బాయి అమెరికా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కందుల కామరాజు- లక్ష్మీ దంపతుల… -
Breaking: జేసీ ఇంట్లో ఈడీ సోదాలు..
ఆంధ్రప్రదేశ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.. జేసీ ప్రభాకర్రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాల సమయంలో ఇంట్లో ఉన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డితో పాటు.. జేసీ ప్రభాకర్రెడ్డి. మరోవైపు… కాంట్రాక్టర్ చవ్వా గోపాలరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున జేసీ ఇంట్లోకి ప్రవేశించిన ఈడీ అధికారులు సోదాలు చేపట్టడంతో..… -
Andhra Pradesh: నిరుద్యోగులకు గమనిక.. హెచ్సీఎల్ వాక్ ఇన్ డ్రైవ్
ఏపీలో నిరుద్యోగులకు హెచ్సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించినట్లు హెచ్సీఎల్ వెల్లడించింది. ఈ మేరకు వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. పదో తరగతి పాసైన వారికి, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి ‘టెక్ బీ’ కార్యక్రమం కింద కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్సీఎల్ చెప్పింది. ఎంపికైన వారికి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి… -
Andhra Pradesh: ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంపు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈనెల 17 వరకే బదిలీలు ఉంటాయని ప్రకటించగా.. కొన్నిశాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. దీంతో ఉద్యోగ సంఘాలు, కలెక్టర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈనెల 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంచుతూ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి గురువారం రాత్రి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ నేడు విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్షోలు, సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు ★ ఏలూరు జిల్లా: నేడు పోలవరం రానున్న సీడబ్ల్యూసీ నిపుణుల బృందం.. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పనులను పరిశీలించనున్న బృందం ★ నేడు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బెయిల్ పిటిషన్పై విచారణ ★ నేడు బాసరకు వెళ్లనున్న టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. ట్రిపుల్… -
Kakinada: పింఛన్ అడిగిన వ్యక్తిని దూషించిన వైసీపీ ఎమ్మెల్యే
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి గురువారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 24వ వార్డులో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే ద్వారంపూడిని ప్రశ్నించాడు. దీంతో ద్వారంపూడి సదరు వ్యక్తి ఆధార్ కార్డును పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అర్హత లేదని చెప్పడంతో సదరు వ్యక్తి పదే పదే పింఛన్పై ఎమ్మెల్యేను…
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!