Pawan Kalyan: సమాజ క్షేమమే.. జనసేన పార్టీ ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదని.. తన కుమార్తె మృతికి కారణమైన వారికి శిక్ష పడాలని సుగాలి ప్రీతి తల్లి చట్టాలను తెలుసుకున్నారని తెలిపారు. మహిళలు ఇబ్బందులు పడుతోంటే.. పెంపకం సరిగా లేదనే కామెంట్లు మంత్రుల నుంచి రావడం సరికాదన్నారు. వైసీపీకి ఆశ ఉంటే.. జనసేన పార్టీకి ఆశయం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Read Also: Vishnu Vardhan Reddy: అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దు
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
జనసేనకు ఓటమిని తట్టుకునే శక్తి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజ క్షేమమే జనసేన పార్టీ ధ్యేయమన్నారు. సుగాలి ప్రీతి, వనజీవి రామయ్య వంటి వారు గొప్ప వాళ్లు అని.. అధికారం ఉన్న రాజకీయ నేతలు అల్పులు అని పవన్ తెలిపారు. అలాంటి అల్పులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను వేధించే వారిని.. దోపిడీ చేసే వారిని ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో మద్యపానం నియంత్రణ చేస్తానన్నారని.. ఉపాధి కల్పిస్తామన్నారని.. కానీ ప్రతిదీ రివర్సే జరిగిందని పవన్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పెద్ద పార్టీల వల్ల కూడా రాదనుకున్న మార్పు కేజ్రీవాల్ పెట్టిన ఆప్ వల్ల వచ్చిందన్నారు. అక్రమంగా సారా మీద సంపాదిస్తుంటే ఏసీబీని నియంత్రించే హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ కోసం జనసేన ఆవిర్భవించిందని.. పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల ప్రొటెక్షన్ కోసం జనసేన పని చేయదని పవన్ అన్నారు. సామాన్యుల ఇబ్బందులను వినేందుకే శనివారం నాడు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!