Pawan Kalyan: సమాజ క్షేమమే.. జనసేన పార్టీ ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదని.. తన కుమార్తె మృతికి కారణమైన వారికి శిక్ష పడాలని సుగాలి ప్రీతి తల్లి చట్టాలను తెలుసుకున్నారని తెలిపారు. మహిళలు ఇబ్బందులు పడుతోంటే.. పెంపకం సరిగా లేదనే కామెంట్లు మంత్రుల నుంచి రావడం సరికాదన్నారు. వైసీపీకి ఆశ ఉంటే.. జనసేన పార్టీకి ఆశయం ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Read Also: Vishnu Vardhan Reddy: అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దు
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
జనసేనకు ఓటమిని తట్టుకునే శక్తి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజ క్షేమమే జనసేన పార్టీ ధ్యేయమన్నారు. సుగాలి ప్రీతి, వనజీవి రామయ్య వంటి వారు గొప్ప వాళ్లు అని.. అధికారం ఉన్న రాజకీయ నేతలు అల్పులు అని పవన్ తెలిపారు. అలాంటి అల్పులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను వేధించే వారిని.. దోపిడీ చేసే వారిని ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో మద్యపానం నియంత్రణ చేస్తానన్నారని.. ఉపాధి కల్పిస్తామన్నారని.. కానీ ప్రతిదీ రివర్సే జరిగిందని పవన్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పెద్ద పార్టీల వల్ల కూడా రాదనుకున్న మార్పు కేజ్రీవాల్ పెట్టిన ఆప్ వల్ల వచ్చిందన్నారు. అక్రమంగా సారా మీద సంపాదిస్తుంటే ఏసీబీని నియంత్రించే హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ కోసం జనసేన ఆవిర్భవించిందని.. పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల ప్రొటెక్షన్ కోసం జనసేన పని చేయదని పవన్ అన్నారు. సామాన్యుల ఇబ్బందులను వినేందుకే శనివారం నాడు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!