Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Vishnu Vardhan Reddy Clarity On Alluri Jayanti Sabha

Vishnu Vardhan Reddy: అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దు

Published Date :July 2, 2022 , 6:01 pm
By Ramesh Nalam
Vishnu Vardhan Reddy: అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి జనసేన పార్టీని ఆహ్వానించలేదని వస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి ప్రత్యేకంగా జనసేనను ఆహ్వానించాల్సిన అవసరం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బీజేపీ-జనసేన ఒక్కటేనని.. పవన్ తమ ఇంట్లో అతిథిలాంటి వాడని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భీమవరంలో అల్లూరి జయంతి సభను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. మోదీ సభకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి 20 వేల మంది వస్తారని ఆయన తెలిపారు. జన సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. అల్లూరి విగ్రహాన్ని రూ.3 కోట్లతో భారత ప్రభుత్వం తయారు చేయించిందని వివరించారు.

Read Also: Tirumala Assets: శ్రీవారి ఆస్తుల విలువెంత? రక్షించే నాథుడెవరు?

Also Read

  • MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
  • AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్‌.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

అల్లూరి విగ్రహావిష్కరణకు అన్ని రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం పలికినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధాని తెలంగాణలో పర్యటిస్తుంటే చిల్లర రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని కూడా పిలిచామన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణను కూడా కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారని.. ప్రధానికి ఆహ్వానం పలకకపోవడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమన్నారు. గతంలో ప్రధాని గురించి హోర్డింగులు కట్టిన వాళ్లు ఏమయ్యారో చరిత్రలో చూడవచ్చని చురకలు అంటించారు. రాష్ట్రాభివృద్ధిపై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే మోదీతో చర్చించాలన్నారు. తెలంగాణలో ఆత్మహత్యల గురించి కేసీఆర్ ఆలోచించాలని హితవు పలికారు.ప్రధాని వస్తుంటే పోటీగా టూ వీలర్ ర్యాలీలు పెట్టడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేసీఆర్ అడుగు పెట్టాక మహారాష్ట్ర ఏమైందో అందరికీ కనిపించిందన్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేక నాయకుడు అని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ బహిష్కరించిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా తెచ్చారన్నారు. త్వరలో కేసీఆర్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటాడని..

డీజిల్ ధరలు బూచి చూపించి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచిందని విష్ణువర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసి సజ్జలకే అన్నీ అప్పచెప్పవచ్చు కదా అని జగన్‌కు సూచించారు. ఏపీలో మంత్రులు డమ్మీ మంత్రులా అని నిలదీశారు. ఏపీ మంత్రులు తీసేసిన తహసీల్దారుల్లా ఉన్నారని.. ఏ అంశంలో అయినా మంత్రుల బదులు సలహాదారులు మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. పేద ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపుతోందని.. ఇటీవల సీఎం జగన్ ఒక బూతు పదం మాట్లాడుతున్నారని.. ఏపీలో ఫ్రస్ట్రేషన్ పాలన ఉందని.. బూతులకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలని.. ఎవరైనా బూతులు నేర్చుకోవాలంటే మన రాష్ట్రానికి రావాలని చెప్పాలంటూ విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluri jayanti sabha
  • Andhra Pradesh
  • Bharatiya Janata Party
  • Vishnu Vardhan Reddy

తాజావార్తలు

  • Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?

  • Depression: యువతను వెంటాడుతున్న డిప్రెషన్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ మనసుని ప్రశాంతంగా మార్చుకోండి!

  • Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions