Pegasus Row: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు పెగాసస్పై హౌస్ కమిటీ సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదికను ఇచ్చింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్…
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా మౌనమే అని.. ఏపీలో గిరిజన మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు కలచి వేశాయని పవన్ అన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందనే వాస్తవాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని వివరించారు.…
Kanna Lakshmi Narayana: బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని తిరుపతిలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. ఆయన అస్తవ్యస్త పాలనతో జనం విసిగిపోయారని ఆరోపించారు. వైసీపీ అసమర్థపరులపై తాము పోరాటం…
Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఈ మేరకు డేటా చౌర్యం అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా పెగాసస్ అంశంపై కమిటీ నివేదికను పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. చంద్రబాబు హయాంలో డేటా చౌర్యం జరిగిందని తాము నిర్ధారించినట్లు భూమన తెలిపారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ సభ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక…
Supreme Court: తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి, ఆంధ్రప్రదేశ్లో 175 నుండి 225 వరకు పెంచాలని.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పర్యావర నిపుణుడు ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ,…
CM Jagan: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో హాట్ హాట్గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయని.. ఆ పార్క్ మనకు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. కానీ ఆ పార్కు వద్దని కేంద్రానికి టీడీపీ లేఖ రాసిందని జగన్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని.. రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లతో డ్రగ్ పార్క్ వస్తుంటే టీడీపీ…
Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతాడని.. నిన్న దొంగ సర్వేల గురించి చెప్పాడని ఆరోపించారు. ఇలాంటి సర్వేల వల్లే గతంలో బొక్కబోర్లా పడ్డాడని.. తమకు 45 సీట్లు వస్తాయంటే.. ఆయనకు 130 వస్తాయా అని రోజా ప్రశ్నించారు. పవన్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని.. 2019లో ఆయన మాటే శాసనం అన్నాడని.. అసెంబ్లీపై జనసేన జెండా ఎగరేస్తానని చెప్పాడని..…
ATM Cash Robbery: కడప జిల్లాలో ఏటీఎం క్యాష్ చోరీ స్థానికంగా కలకలం రేపింది. కడపలోని పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలు అధికారులు సీఎంఎస్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ నెల 16న కడప నగరంలోని ఏటీఎంలలో రూ.71 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. ఈ మేరకు సీఎంఎస్ యోధ వాహనంలో క్యాష్ కస్టోడియన్ సునీల్తో పాటు మహేంద్ర రెడ్డి లోహియానగర్లోని ఓ ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్లారు. ఆ సమయంలో వాహనం…
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారని.. అయినా చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు త్వరలో మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే…