High Court: అమరావతి రైతుల పాదయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో.. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.. అయితే, మేం ఇచ్చిన ఆదేశాలకు లోబడే అమరావతి మహాపాదయాత్ర జరగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది… పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది హైకోర్టు.. ఎవరైనా పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకుంటే రోడ్డు పక్కనే ఉండి సంఘీభావం తెలపాలని పేర్కొంది… కోర్టు అనుమతించిన వారు తప్ప వేరేవాళ్లు పాదయాత్రలో పాల్గొనకూడదని హైకోర్టు ఆదేశించింది… ఇక, పాదయాత్రలో నాలుగు వాహనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.. కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: Dasoju Sravan: బీజేపీకి ఊహించని షాకిచ్చిన దాసోజు.. మళ్లీ కారెక్కుతున్నాడు..
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అంతే కాదు.. హైకోర్టు విధించిన నిబంధను పాటించడంలో విఫలమైతే మాత్రం అమరావతి పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించింది హైకోర్టు.. కాగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా.. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. అధికార వికేంద్రీకరణే లక్ష్యమని.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుండగా.. అమరావతి కోసం రైతుల చేస్తున్న పాదయాత్రపై ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అడ్డంకులు కల్పిస్తోందని, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది.. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!