Rahul Gandhi: నేడు ఏపీలో ముగియనున్న భారత్ జోడో యాత్ర.. మళ్లీ కర్ణాటకలోకి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్యాకుమారిలో ప్రారంభమై కాశ్మీర్ వరకు సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. ఇవాళ మరోసారి కర్ణాటకలోకి ప్రవేశించనుంది… 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3వేల 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగేలా రూట్మ్యాప్ సిద్ధం చేసిన విషయం తెలిసిందే కాగా.. దేశాన్ని ఏకసూత్రంతో జోడించడమే యాత్ర లక్ష్యం అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బలహీనవర్గాల పక్షాన భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు.. కర్ణాటక నుంచి ఇప్పటికే ఓసారి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన ఈ పాదయాత్ర.. మళ్లీ అదే రాష్ట్రంలోకి వెళ్లింది.. ఆ తర్వాత మరోసారి ఏపీలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. నిన్న మంత్రాలయం చేరుకున్నారు.. గురువారం రోజు ఏపీలోని రాయదుర్గం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో సాగింది జోడో యాత్ర.. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న రాహుల్ గాంధీ.. ఇవాళ ఏపీలో తన పాదయత్రను ముగించనున్నారు.
Read Also: Chad: చాద్లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి
Also Read
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
ఇవాళ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం సర్కిల్ నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది.. ఆంధ్రప్రదేశ్లో 120 కిలోమీటర్ల మేర సాగింది భారత్ జోడో యాత్ర.. ఇక, రాహుల్ గాంధీకి వీడ్కోలు పలకడానికి మంత్రాలయం చేరుకుంటున్నారు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు.. చెట్ట్నే హళ్లి.. మాధవరం మీదుగా కర్ణాటకలో అడుగుపెట్టనున్నారు రాహుల్.. తుంగభద్ర నది వంతెన మధ్యలో ముగియనుంది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు.. అక్కడే కర్ణాటక నేతలు రాహుల్ మరోసారి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం అయ్యారు.. కర్నాటకలోని రాయ్చూర్ జిల్లాలోకి రాహుల్ గాంధీ యాత్ర ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఈ రోజు, రేపు రాయచూర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగించనున్నారు రాహుల్ గాంధీ.. ఇక, ఎల్లుండి ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనుంది భారత్ జోడో యాత్ర.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!