Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక కామెంట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో సామాన్యులకు స్థానం ఉండదని ఆరోపించారు. క్యాపిటల్ అంటే యాక్సప్టబులిటీ ఉండాలని.. రవాణా సౌకర్యం ఉండి తీరాలని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ధనవంతుల జాబితా తీస్తే 100 మందిలో 99 మంది ఇతర ప్రాంతాల వారే ఉంటారన్నారు. ఉత్తరాంధ్రకు రాజ్యాంగబద్ధంగా ఆస్తులు, సంపదలు చేజారాయన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా క్యాపిటల్ చుట్టూ మాత్రమే జరిగిందని…
Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70…
Vijayawada: దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. టపాసుల దుకాణాలతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాత్రి తిరుపతిలో, ఆదివారం ఉదయం విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి మందులు విక్రయించే స్టాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న మరో రెండు షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో మూడు షాపుల్లో దీపావళి టపాసులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. Read…
Dharmana Krishna Das: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైసీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా జగన్ మరోసారి సీఎం అవుతారంటూ జోస్యం చెప్పారు. అలా జరగని పక్షంలో తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని ధర్మాన కృష్ణదాస్ ప్రకటించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరితో…
What’s Today: * టీ20 ప్రపంచకప్: నేడు హోబర్ట్ వేదికగా శ్రీలంక-ఐర్లాండ్ ఢీ, ఉదయం 9:30 గంటలకు మ్యాచ్.. మెల్బోర్న్ వేదికగా భారత్-పాకిస్థాన్ ఢీ, మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ * నేడు తెలంగాణలోకి ప్రవేశించనున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర.. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రాహుల్కు స్వాగతం పలకనున్న కాంగ్రెస్ శ్రేణులు.. తొలిరోజు 3.9 కిలోమీటర్ల మేర సాగనున్న రాహుల్ పాదయాత్ర *…
Andhra Pradesh: ఇటీవల విశాఖలో మంత్రులపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలోని మంత్రులు, పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. అర్జీలు ఇచ్చే సాకుతో జనసేన కార్యకర్తలు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ విభాగం వార్నింగ్ ఇచ్చింది. టెక్కలిలో జనసేన కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి అలర్ట్ కావాలంటూ ఇంటెలిజెన్స్…
Kidnap Woman: గుంటూరులో వరుసగా కిడ్నాప్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ల వ్యవహారంలో నాగమ్మ అనే ఓ మహిళ కీలక సూత్రధారిగా ఉందన్నారు. కిడ్నాప్ వ్యవహారం తెలియగానే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశామని.. పిల్లల్ని డబ్బు కోసమే నాగమ్మ గుంటూరు నుంచి తీసుకువెళ్లి జంగారెడ్డిగూడెంలో అమ్మేసిందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో ఇటీవల జరిగిన బాలుడు కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలకు భద్రత…
Pawan Kalyan: విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో జైలు నుంచి 9 మంది జనసేన నాయకులు విడుదల కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖపట్నంలో పాలకపక్షం బనాయించిన అక్రమ కేసుల వల్ల జైలుపాలైన తొమ్మిది మంది నేతలు ఈరోజు బెయిల్ మీద బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామం అని పవన్ పేర్కొన్నారు. జనసేన నేతలు జైలులో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసన్నారు. జైలులో ఉన్న…
Janasena Party: విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి ఘటన విషయంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 9 మంది జనసేన నేతలు విడుదలయ్యారు. ఈ మేరకు కేంద్ర కారాగారం వద్ద సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా తమకు బెయిల్ మంజూరు చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి జనసేన నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు ఇచ్చి అహర్నిశలు…
Amaravathi: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా…