BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
- తీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు..
- ఇండోనేషియా భారత్ తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలని నిర్ణయం..
- వచ్చే 2–3 నెలల్లో భారత్-ఇండోనేషియా మధ్య అధికారిక ఒప్పందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BrahMos Deal: ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా దేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
Also Read
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
సమాచారం ప్రకారం మొదటి దశలో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఒక బ్యాటరీని కొనుగోలు చేయనుంది. అనంతరం దానిని దశలవారీగా పెంచే ప్రణాళిక కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే రెండో దేశంగా ఇండోనేషియా నిలుస్తుంది. గత ఏడాది నవంబర్లో ఇండోనేషియా రక్షణ మంత్రి స్యాఫ్రి స్యామ్సోయెద్దీన్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని సందర్శించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు బ్రహ్మోస్ క్షిపణి మోడల్ను బహుమతిగా అందజేశారు. ఈ పర్యటన అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియ వేగం పుంజుకుంది.
Hyderabad: హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!
ఇప్పటికే ఫిలిప్పీన్స్ 2022లో బ్రహ్మోస్ క్షిపణి మూడు బ్యాటరీలను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇండోనేషియా కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణిగా గుర్తింపు ఉంది. ఇందులో ఎగుమతి వర్షన్ సుమారు 290 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది యాంటీ-షిప్, భూభాగంపై దాడులు, తీర రక్షణ వంటి అనేక మిషన్లలో ఉపయోగించవచ్చు. శబ్ద వేగానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది.
తాజావార్తలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!