Thopudurthi Prakash Reddy: టీడీపీ కారణంగా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మరోసారి టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో జిల్లాకు జాకీ పరిశ్రమ వచ్చిందా అని మీడియా సాక్షిగా ఆయన ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని.. ఇతర రాష్ట్రాల్లో యూనిట్లను ఎత్తివేసిందని ఆరోపించారు. ఆరోజు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పాటించారని.. అందరూ కలిసి రూ.300 కోట్ల స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రానికి రూ.40లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అప్పటి మంత్రి లోకేష్ చెప్పారని.. ఇప్పుడు ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్లాయా అని చురకలు అంటించారు. రికార్డుల్లో 14 కంపెనీలు వచ్చినట్టు చూపారని.. అవి ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు.
Read Also: Super Star Krishna: కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగింది.. సంచలన నిజాలు వెలుగులోకి..?
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
- Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
రాని పరిశ్రమలు వచ్చాయని టీడీపీ నేతలు కట్టు కథలు చెప్పారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాకీ కోసం రూ.140 కోట్లు విలువైన భూమిని రూ. 2.5 కోట్లకు సేల్ డీడ్ చేశారని.. మరి ఆ రోజు పరిశ్రమ ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. పరిటాల సునీత అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయారని.. 2018 అక్టోబర్లోనే ఉత్పత్తి, ట్రైనింగ్ ప్రారంభించాలని ఒప్పందంలో ఉందని.. కాంపౌండ్ వాల్ సగంలోని ఎందుకు ఆపేశారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ నిర్వాహకులు తిరుపూరు, బెంగళూరులో నాలుగు యూనిట్లు మూసివేశారని.. ఇలాగే రాప్తాడులో కూడా జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని వివరించారు. ఈ రోజు కూడా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదని.. భువనేశ్వర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూములు తీసుకున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని.. మార్కెట్ ధరకు తాము భూములు కేటాయిస్తున్నామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. కనీసం 12సంవత్సరాలు ప్రొడక్షన్ ఉంటే భూమి అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
-
Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. టీమ్ ఇండియా అరుదైన రికార్డు..
-
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
-
CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ
-
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!