Thopudurthi Prakash Reddy: టీడీపీ కారణంగా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మరోసారి టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో జిల్లాకు జాకీ పరిశ్రమ వచ్చిందా అని మీడియా సాక్షిగా ఆయన ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని.. ఇతర రాష్ట్రాల్లో యూనిట్లను ఎత్తివేసిందని ఆరోపించారు. ఆరోజు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పాటించారని.. అందరూ కలిసి రూ.300 కోట్ల స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రానికి రూ.40లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అప్పటి మంత్రి లోకేష్ చెప్పారని.. ఇప్పుడు ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్లాయా అని చురకలు అంటించారు. రికార్డుల్లో 14 కంపెనీలు వచ్చినట్టు చూపారని.. అవి ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు.
Read Also: Super Star Krishna: కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగింది.. సంచలన నిజాలు వెలుగులోకి..?
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
రాని పరిశ్రమలు వచ్చాయని టీడీపీ నేతలు కట్టు కథలు చెప్పారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాకీ కోసం రూ.140 కోట్లు విలువైన భూమిని రూ. 2.5 కోట్లకు సేల్ డీడ్ చేశారని.. మరి ఆ రోజు పరిశ్రమ ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. పరిటాల సునీత అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయారని.. 2018 అక్టోబర్లోనే ఉత్పత్తి, ట్రైనింగ్ ప్రారంభించాలని ఒప్పందంలో ఉందని.. కాంపౌండ్ వాల్ సగంలోని ఎందుకు ఆపేశారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ నిర్వాహకులు తిరుపూరు, బెంగళూరులో నాలుగు యూనిట్లు మూసివేశారని.. ఇలాగే రాప్తాడులో కూడా జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని వివరించారు. ఈ రోజు కూడా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదని.. భువనేశ్వర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూములు తీసుకున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని.. మార్కెట్ ధరకు తాము భూములు కేటాయిస్తున్నామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. కనీసం 12సంవత్సరాలు ప్రొడక్షన్ ఉంటే భూమి అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!