Kodali Nani: గుడివాడలో చంద్రబాబు, లోకేష్ పోటీచేసినా.. గెలిచేది నేనే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీడీపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా, ఆయన పుత్రరత్నం లోకేష్ పోటీ చేసినా వైసీసీ అభ్యర్థిగానే తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, కుల సంఘాలు వచ్చిన అరిచి గోల చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కేవలం సీఎం జగన్ను తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని.. చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేదేమీ లేదని చురలు అంటించారు. చంద్రబాబుకే కాకుండా టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కొడాలి నాని జోస్యం చెప్పారు.
Read Also: Thopudurthi Prakash Reddy: టీడీపీ కారణంగా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదు
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నాడని.. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్ను తరిమేందుకు ఎన్టీఆర్ వారసులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు మాట్లాడాడని కొడాలి నాని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మరా అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారని ఎద్దేవా చేశారు. తాను ఎవ్వరికీ భయపడే రకాన్ని కాదని.. ఎంతమంది వచ్చినా గుడివాడ ప్రజలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. జీవించి ఉన్నంతకాలం జగన్ సీఎంగా ఉంటారని కొడాలి నాని అన్నారు. తన ఆఖరి రక్తపుబొట్టు వరకు జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!