Andhra Pradesh: ఈనెల 23న శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ వరుస పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈనెల 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల మధ్య నరసన్నపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:25 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.
Read Also: Rasna Founder passed away: ‘రస్నా’ వ్యవస్థాపక చైర్మన్ ఇక లేరు..
Also Read
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Off The Record : టీడీపీ, జనసేన మధ్య హాట్ హాట్ గా ఏలూరు మేయర్ సీటు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
కాగా శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ రక్ష , భూహక్కు కార్యక్రమం లబ్దిదారులకు ఎంతో ప్రయోజనం కల్పిస్తుందని తెలిపారు. బ్రిటీష్ హయాంలో భూములకు సర్వే జరిపారని.. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేకపోయాయని వివరించారు. ప్రయోజనం పెద్దగా లేదనే ప్రభుత్వాలు రీ సర్వే జరపలేదని.. కానీ ఈ కార్యక్రమం భూతగాదాల నిర్మూలనకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామాలలో అశాంతికి కారణం భూ రికార్డులలో ఉన్న సమస్యేనని.. భూమి హక్కు , భూ రక్ష కార్యక్రమం వల్ల ప్రశాంత జీవనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడికి అవకాశం ఉంటుందని… పరిశ్రమలు, ఉద్యోగ కల్పన కూడా పరోక్షంగా జరుగుతాయన్నారు. రీ సర్వే వల్ల పేదప్రజల ఆస్తికి రక్షణ లభిస్తుందన్నారు. రైతులు ఈ సర్వేలో పాల్గొనాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. అటు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు సహా రెవెన్యూ వ్యవస్థలను సంస్కరిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలలో మార్పు చేసి గ్రామాలలోనే రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ముటేషన్ ఆటోమేటిక్గా అయిపోతుందని పేర్కొన్నారు. టైటలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని దేశంలోనే మొదటిసారి తీసుకువస్తున్నామని మంత్రి ధర్మాన చెప్పారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!