Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను శుక్రవారం సాయంత్రం ప్రముఖ నగల విక్రయ సంస్థ జోయ్ అలుక్కాస్ అధినేత అలుక్కాస్ వర్గీస్ జాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో అలుక్కాస్ వర్గీస్ సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. Read Also: తమన్నా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు నిద్రపోతారా ? ఈ సందర్భంగా ఏపీలో తాము అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను సీఎం జగన్ జోయాలుక్కాస్…
Chandra Babu: ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఈ జీవోపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును నిలిపివేయాలంటూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ…
Naga Babu: ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు.…
విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.. 81 అడుగుల విగ్రహ పీఠం, 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి పూనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుకు మొత్తంగా రూ.268 కోట్లు ఖర్చు చేస్తోంది.. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం..…
జీవో నంబర్1పై ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం-సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ.. జీవో నంబర్ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది భారత అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.. ఈ నెల 23వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది.. హైకోర్టు సీజే విచారణ జరపాలని ఆదేశించింది…