VishnuKumar Raju: భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ సంకేతాలు పంపింది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలబోమని మరోసారి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయనున్నట్లు సమాచారం. జనసేన పొత్తులో ఉంటే మంచిది.. లేకున్నా మంచిది అనే సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంటరి పోరుకు సిద్ధ పడాలని రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ డైరెక్షన్ ఇవ్వనుంది.…
Rayapati SambasivaRao: గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టపడే వారికి టికెట్లు ఇవ్వాలని.. తమ కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబును అడిగామని.. దీనికి టీడీపీ అధిష్టానం సమాధానం చెప్పాలని రాయపాటి అన్నారు. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమలో ఎక్కడ ఇచ్చినా తమ రాజకీయ వారసుడు రంగబాబు పోటీ చేస్తాడని రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు.…
నేడు కొండగట్టుకు పవన్ కల్యాణ్… ‘వారాహి’కి పూజలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి…
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోని భక్తులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన…
JEE Mains: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో అధికారులు నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసివేస్తారు.…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక…
* నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే.. ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. మరో క్లీన్ స్వీప్పై టీమిండియా కన్ను * అమరావతి: జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ.. అదనపు పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ధర్మాసనం * జగిత్యాల జిల్లా: నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ధర్మపురి నుండి…
AP Government Notice: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అసలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని నోటీసులు ఇచ్చింది జీఏడీ.. దీనికి కోసం వారం రోజులు గడువు పెట్టింది.. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.. వేతనాలు,…