JEE Mains: నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. గంట ముందే పరీక్ష హాలులోకి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Mains: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో అధికారులు నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసివేస్తారు. అంటే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా పరీక్ష సమయం పూర్తయ్యేవరకు అభ్యర్థులెవ్వరినీ బయటకు పంపే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: HCU: హెచ్సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
Also Read
పరీక్షలకు హాజరయ్యేవారు ఒరిజినల్ గుర్తింపుకార్డు, హాజరు షీట్పై అతికించేందుకు పాస్పోర్టు సైజ్ ఫోటోను పరీక్షా కేంద్రంలోకి తీసుకువెళ్లాలి. మాస్కులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు. ఇంటి నుంచి తీసుకెళ్లే మాస్కులను అనుమతించమంటూ అధికారులు తెలిపారు. పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 8,66, 411 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ పరీక్షలకు ఎక్కువ మంది హాజరయ్యే మొదటి ఐదు రాష్ట్రాలలో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. విజయవాడలో 15వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1,03,039 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 99,714 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 91,799 మంది, తెలంగాణ నుంచి 86,840 మంది, రాజస్థాన్ నుంచి 59, 641 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలను రాయనున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!