JEE Mains: నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. గంట ముందే పరీక్ష హాలులోకి అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Mains: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో అధికారులు నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసివేస్తారు. అంటే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా పరీక్ష సమయం పూర్తయ్యేవరకు అభ్యర్థులెవ్వరినీ బయటకు పంపే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: HCU: హెచ్సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
పరీక్షలకు హాజరయ్యేవారు ఒరిజినల్ గుర్తింపుకార్డు, హాజరు షీట్పై అతికించేందుకు పాస్పోర్టు సైజ్ ఫోటోను పరీక్షా కేంద్రంలోకి తీసుకువెళ్లాలి. మాస్కులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు. ఇంటి నుంచి తీసుకెళ్లే మాస్కులను అనుమతించమంటూ అధికారులు తెలిపారు. పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 8,66, 411 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ పరీక్షలకు ఎక్కువ మంది హాజరయ్యే మొదటి ఐదు రాష్ట్రాలలో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. విజయవాడలో 15వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1,03,039 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 99,714 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 91,799 మంది, తెలంగాణ నుంచి 86,840 మంది, రాజస్థాన్ నుంచి 59, 641 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలను రాయనున్నారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!