Tirupati Laddu Controversy: తిరుమల హిందువులకు పవిత్రమైన దేవాలయం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వస్తారు.. అలాంటి తిరుమల లడ్డు కల్తీపై తప్పుడు ప్రచారం దుర్మార్గం.. జగన్ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
Guntakal MLA Sticker Car: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనాన్ని ఉపయోగిస్తూ ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించిన ఘటన అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. మత్తులో ఉన్న వాళ్లు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రథయాత్ర ప్రారంభంకానుంది. రథోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. కళ్యాణ దివ్యమూర్తులను రథంపై కొలువు దీర్చి భక్తజనం నడుమ వైభవంగా ఊరేగించడం అంతర్వేది క్షేత్రంలో ఆనవాయితీగా వస్తుంది.
ఆ వర్గాలకు గుడ్న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మొత్తం 35 అజెండా అంశాలపై చర్చించి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక వసతులు, గృహ నిర్మాణం, విద్యుత్, పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు…
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం.. మంత్రులకు సీఎం కీలక సూచనలు.. తిరుమల టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్ నివేదికపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారంపై ఏపీ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్న తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, టీటీడీ కల్తీ నెయ్యి…
MLA Arava Sridhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీని నియమించింది. అరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.
Today My Last Day: తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి తులసి, BSR డిగ్రీ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో ఇవాళ ( జనవరి 28న) కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది.