AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల (Wetlands) గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ మంచినీటి సరస్సు ‘కొండకర్ల ఆవ’ను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్) ప్రాంతంగా ప్రకటించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. అటవీశాఖ సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ ఆమోదం తెలుపుతూ, అవసరమైన నిరభ్యంతర పత్రాన్నిజారీ చేయడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
స్థానిక రైతుల సాగునీటి అవసరాలు, మత్స్యకారుల జీవనోపాధి , జలాశయ నిర్వహణ వంటి ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా తగిన రక్షణ చర్యలతో ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చింది. అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవ అనేక రకాల వలస, స్థానిక పక్షులకు సురక్షిత ఆవాసంగా నిలుస్తోంది. కొండకర్ల ఆవను సమగ్రంగా సర్వే చేసి, జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుంటూ పర్యావరణహిత ‘ఎకో-టూరిజం’ అభివృద్ధి అవకాశాలపై అధ్యయనం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూనే, ఎకో-టూరిజం ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రజలకు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
Also Read
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
శాస్త్రీయ అధ్యయనాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 950 చిత్తడి నేలలను గుర్తించగా, తొలి దశ కింద 16 చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియ తుది దశకు చేరిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. చిత్తడి నేలల పరిరక్షణ ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత సాధ్యమవుతాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పర్యావరణ పరిరక్షణ చర్యలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొంటూ, చిత్తడి నేలల ఆక్రమణలు , విధ్వంసక చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను గట్టిగా ఆదేశించారు.
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!