ఇప్పుడు శ్రీవాణి దర్శన టిక్కెట్ల సంఖ్య పెంచే యోచనలో ఉంది.. ప్రస్తుతం జారి చేస్తున్న 1500 టిక్కెట్లను 2 వేలకు పెంచేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు.. ప్రస్తుతం నిత్యం ఆన్ లైన్ లో 500 టిక్కెట్లు.. ఆఫ్ లైన్ లో 1000 టిక్కెట్లు జారీ చేస్తూ వస్తుంది టీటీడీ.. అయితే, ఆఫ్లైన్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా.. ఆఫ్ లైన్ లో మరో 500 టిక్కెట్లు పెంపునకు వున్న అవకాశాలను పరిశీలిస్తుంది టీటీడీ.. ఆఫ్ లైన్…
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఫేస్బుక్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.. శ్రీకాంత్ పెరోల్ మంజూరు, రద్దు తరువాత పలు అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అరుణ.. శ్రీకాంత్ ను వాడుకున్న వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రీకాంత్ బాధ పడుతుంటే మీకు ఇష్టం అని అర్థం అవుతుంది.. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక నేను ఎందుకు నోరు విప్పకూడదు..? అని ప్రశ్నించింది..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారు అంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.. అంతేకాదు.. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారు అంటూ సెటైర్లు వేశారు..
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపు చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గుర్తించారు.. సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు.. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం రోజు తీర్పును వెలవరించింది ఏపీ హైకోర్టు.. అయితే, కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. వివిధ కోర్టుల్లో బెయిల్ దొరికింది.. దీంతో, 85రోజులుగా జైల్లో ఉన్న కాకాణి గోవర్దన్రెడ్డి ఈ రోజు జైలు నుంచి విడుదల కాబోతున్నారు..
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో.. విశాఖ స్టీల్ పై కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్.. ఆదుకోవడం పచ్చి అబద్ధం.. ఉద్ధరించడం అంతా బూటకం.. ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ లో 44 EOI లకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం.. ఇది ప్లాంట్ ను చంపే కుట్రలో భాగమే.. 5 వేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు ?.. ఆ పనులను ఎందుకు…