PVN Madhav: మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులే కొనాలి.. మళ్లీ స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి..
- మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి..
- మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVN Madhav: మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. విజయవాడలో సారథ్యం యాత్రలో భాగంగా కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టి కి తెచ్చారు ప్రజలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రజలు.. ఇక, ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్య కు ఆయినా పరిష్కారం దొరుకుతుందన్నారు.. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి విశిష్టతను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.. టీ తాగుతూ… ప్రజలు ఆలోచనలు, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం.. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తాం అన్నారు.
Read Also: Donald Trump: మనసు మార్చుకున్న ట్రంప్.. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుందన్నారు మాధవ్.. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం బాగా దెబ్బతింది.. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది.. కేంద్రం సహకారంతో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు.. త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారని తెలిపారు. ఇక, జీఎస్టీ పన్నులు తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు మోడీ ఉపశమనం కలిగించారు.. నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గడం ద్వారా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.. అయితే, సిగరేట్, గుట్కా వంటి మత్తుపదార్థాలకు, లగ్జరీ కార్లుకు మాత్రం నలభై శాతం పన్ను పెంచారని గుర్తుచేశారు.. మోడీ ప్రజల మనిషి… ప్రజల మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారు.. గత ఏడాది ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపు వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి కలుపుతూ ఒ.ఆర్.ఆర్ నిర్మాణం జరుగుతుంది.. అన్ని రకాల పరిశ్రమలు మన రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయన్నారు..
Read Also: TTD: క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి.. టీటీడీ కీలక నిర్ణయం..
ఇక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతున్నాయి.. 75 వసంతాల స్వాతంత్ర్య కాలంలో ఎంతో పురోగతి సాధించాం అన్నారు మాధవ్.. వచ్చే పాతికేళ్లల్లో ప్రపంచంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉండాలనేది మన లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులును కొనుగోలు చేయాలి అని సూచించారు.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలని ఆకాక్షించారు.. ప్రజలు కూడా ఆలోచనలు చేయండి… అరాచక పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా.. అనే చర్చ పెట్టండి.. ఆత్మ నిర్భర్ భారత్ కోసం అందరం కలిసి అడుగులు వేద్దాం అని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..