Tammineni Sitaram: ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీకి వస్తామంటే ప్రభుత్వం తోక ముడుస్తుంది..!
- ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తాం అన్నాం..
- మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Sitaram: ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆక్రమాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో లూటీలు గృహ దహనాలు మానభంగాలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇలాంటి పద్ధతులు కొనసాగితే మంచిది కాదని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాలు పనికిరావని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని అన్నారు తమ్మినేని సీతారాం..
Read Also: AP Young Man Died in USA: అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. మార్టూరులో విషాదం
Also Read
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్లో కలిశారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఆయనతో పాటు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్.ఆర్ విశ్వనాథన్ , టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్ సి. విష్ణు రెడ్డి ఉన్నారు.. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి అన్నారు. నిర్దోషులను దోషులుగా చిత్రీకరించి జైల్లో పెడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి నిర్దోషి , కచ్చితంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకొని బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు ? ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఏమీ పనికిరావని అన్నారు. ఇది ప్రభుత్వానికి పద్ధతి కాదని, దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలపై అసెంబ్లీలో చర్చించడం ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రజలే చెప్తారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!