AP Crime: ముగ్గురు పిల్లల దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో విషాదం..
- ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన తండ్రి..
- తెలంగాణలో ముగ్గురు చిన్నారుల దారుణ హత్య.. ఆపై తానూ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట యముడిగా మారాడు.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు.. గత నెల 30వ తేదీన ముగ్గురు పిల్లలు దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4)లను బైక్ పై తీసుకొని అదృశ్యమయ్యాడు.. అయితే, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తన కన్న బిడ్డలను చంపి పెట్రోల్ పోసి కాల్చివేసి.. ఆపై ఆత్మహత్యకు గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. ఈ నెల 3న నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండి మండలం పెద్దపూర్ గ్రామ సమీపంలో బూరకుంట చెట్లల్లో పురుగుల మందు తాగి గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ నెల 4వ తేదీన దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4), మృతదేహాలను నాగర్ కర్నూల్ జిల్లాలోనే గుర్తించారు పోలీసులు… ఈ నెల 4న నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సూర్య తాండ సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య వర్షిణి, శివ ధర్మ మృతదేహాలను గుర్తించారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా తాండ్ర వద్ద పెద్దామ్మాయి మోక్షిత మృతదేహాన్ని గుర్తించారు.. పూర్తిగా తగలబడి గుర్తు పట్టలేని స్ధితిలో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.. ముగ్గురు పిల్లల మృతదేహలకు ఈ రోజు పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం మృతదేహలను అక్కడే ఖననం చేయనున్నారు బంధువులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ఘటనకు గల కారణాలపై వివరాలు సేకరించేపనిలో పడిపోయారు పోలీసులు.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!