AP Crime: ముగ్గురు పిల్లల దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో విషాదం..
- ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన తండ్రి..
- తెలంగాణలో ముగ్గురు చిన్నారుల దారుణ హత్య.. ఆపై తానూ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట యముడిగా మారాడు.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది..
Also Read
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు.. గత నెల 30వ తేదీన ముగ్గురు పిల్లలు దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4)లను బైక్ పై తీసుకొని అదృశ్యమయ్యాడు.. అయితే, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తన కన్న బిడ్డలను చంపి పెట్రోల్ పోసి కాల్చివేసి.. ఆపై ఆత్మహత్యకు గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. ఈ నెల 3న నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండి మండలం పెద్దపూర్ గ్రామ సమీపంలో బూరకుంట చెట్లల్లో పురుగుల మందు తాగి గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ నెల 4వ తేదీన దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4), మృతదేహాలను నాగర్ కర్నూల్ జిల్లాలోనే గుర్తించారు పోలీసులు… ఈ నెల 4న నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సూర్య తాండ సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య వర్షిణి, శివ ధర్మ మృతదేహాలను గుర్తించారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా తాండ్ర వద్ద పెద్దామ్మాయి మోక్షిత మృతదేహాన్ని గుర్తించారు.. పూర్తిగా తగలబడి గుర్తు పట్టలేని స్ధితిలో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.. ముగ్గురు పిల్లల మృతదేహలకు ఈ రోజు పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం మృతదేహలను అక్కడే ఖననం చేయనున్నారు బంధువులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ఘటనకు గల కారణాలపై వివరాలు సేకరించేపనిలో పడిపోయారు పోలీసులు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!