AP Crime: ముగ్గురు పిల్లల దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో విషాదం..
- ముగ్గురు పిల్లలతో అదృశ్యమైన తండ్రి..
- తెలంగాణలో ముగ్గురు చిన్నారుల దారుణ హత్య.. ఆపై తానూ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. వారి పాలిట యముడిగా మారాడు.. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులను దారుణంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది..
Also Read
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు.. గత నెల 30వ తేదీన ముగ్గురు పిల్లలు దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4)లను బైక్ పై తీసుకొని అదృశ్యమయ్యాడు.. అయితే, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో తన కన్న బిడ్డలను చంపి పెట్రోల్ పోసి కాల్చివేసి.. ఆపై ఆత్మహత్యకు గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.. ఈ నెల 3న నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండి మండలం పెద్దపూర్ గ్రామ సమీపంలో బూరకుంట చెట్లల్లో పురుగుల మందు తాగి గుత్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ నెల 4వ తేదీన దీపికా(8), వర్షిణి (6), శివధర్మ (4), మృతదేహాలను నాగర్ కర్నూల్ జిల్లాలోనే గుర్తించారు పోలీసులు… ఈ నెల 4న నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సూర్య తాండ సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య వర్షిణి, శివ ధర్మ మృతదేహాలను గుర్తించారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా తాండ్ర వద్ద పెద్దామ్మాయి మోక్షిత మృతదేహాన్ని గుర్తించారు.. పూర్తిగా తగలబడి గుర్తు పట్టలేని స్ధితిలో చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.. ముగ్గురు పిల్లల మృతదేహలకు ఈ రోజు పోస్టుమార్టం నిర్వహించారు.. అనంతరం మృతదేహలను అక్కడే ఖననం చేయనున్నారు బంధువులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ఘటనకు గల కారణాలపై వివరాలు సేకరించేపనిలో పడిపోయారు పోలీసులు.
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..