2023 ఏడాది ముగింపు దశకు వచ్చేశాం.. నేటితో నవంబర్ ముగించుకుని.. రేపు డిసెంబర్లో అడుగుపెట్టబోతున్నాం.. ఇక, డిసెంబర్తో 2023కి బైబై చెప్పేసి.. 2024 ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సాధారణ సెలవులు, ఇతర సెలవులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
నాగార్జున సాగర్ నీటిజలాల విడుదల అంశంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ నీటి విడుదల ఆలోచన ఓట్ల కోసమేనంటూ ఆమె మండిపడ్డారు. ఘోరాతి ఘోరమైన పని సాగర్ దగ్గర కొనసాగుతుంది..
రేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల, కడప జిల్లాల పర్యటించనునున్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో ఆయన పాల్గొననున్నారు.
మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం ఛాన్స్ ఇచ్చారు.. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము జీరోలుగా ఉన్నాం.. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ లీడర్లను, మంత్రులను చేశారు.
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు.
నిన్న మొన్నటి దాక సెంట్రల్ జైల్ లో ఉండి ఆరోగ్యం బాగా లేదనే సాకుతో బయటకు వచ్చి మమ్మల్ని ఓడిస్తాడా.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన.. చంద్రబాబు టికెట్లు వేస్తే ఫ్లైట్ ఎక్కేది పవన్ కళ్యాణ్.. నారా లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసిన ఎప్పటికీ నాయకుడు కాలేడు అంటూ అంబటి రాంబాబు విమర్శించారు.
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు