Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Prashant Kishor Meets Chandrababu Naidu

Prashant Kishor meets Chandrababu: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ..

Published Date :December 23, 2023 , 6:35 pm
By Sudhakar Ravula
Prashant Kishor meets Chandrababu: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prashant Kishor meets Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనమే జరిగింది.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అలియాస్ పీకే.. ఇప్పుడు జెండా మార్చేశారు.. అదేనండి.. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పీకే సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పీకే.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చి నేరుగా టీడీపీ జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కారు ఎక్కారు.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు..

Read Also: Air India: ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి ఎయిర్‌బస్ A350-900.. ఆకాశంలో ఇంద్రభవనం ఈ విమానం..

హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్.. అయితే, లోకేష్‌ .. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. నేరుగా వెళ్లి ఆయన లోకేష్‌ వాహనంలో కూర్చుకున్నారు.. ఆ తర్వాత ఓకే వాహనంలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. ప్రశాంత్ కిషోర్‌తో పాటు చంద్రబాబు నివాసానికి రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది.. ఇక, చంద్రబాబుతో పీకే సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్ధితులపై సుదీర్ఘంగా చర్చ సాగినట్టు సమాచారం.. ఇదే సమయంలో.. తాను చేసిన సర్వేల అంశాలను టీడీపీ అధినేతకు పీకే వివరించారట.. ఈ సమావేశంలో చంద్రబాబు, పీకేతో పాటు లోకేష్‌ కూడా పాల్గొన్నాడు.. మొత్తంగా ఏపీ రాజకీయ వర్గాల్లో చంద్రబాబు-పీకే భేటీ సంచలనం రేకెత్తిస్తోంది.

Read Also: Captain Miller: మన సినిమాలకే థియేటర్లు లేవంటే.. ధనుష్ కూడా సంక్రాంతికే!

కాగా, గత ఎన్నికల్లో ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టడం వెనుక ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు బాగా పనిచేశాయి.. ఈ విషయాన్ని స్వయంగా సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ప్రస్థావించారు.. తన పార్టీని గెలిపించిన పీకే టీమ్‌కు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు.. గత ఎన్నికల్లో వైసీపీని విజయతీరాలకు చేర్చడమే కాదు.. ఆ తర్వాత నాలుగున్నరేళ్లుగా అక్కడ పరిస్థితులపై వైసీపీకి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ వస్తున్నారు పీకే.. మరోవైపు.. తెలంగాణలో కేసీఆర్‌కు కూడా వ్యూహాలు అందిస్తారనే చర్చ సాగింది.. అందులో భాగంగా కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించారు ప్రశాంత్‌ కిషోర్‌.. కానీ, ఏమైందో ఏమో కానీ.. అది పట్టాలు ఎక్కలేదు.. కానీ, ఆ తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో ఉన్న తన టీమ్ మొత్తాన్ని ఏపీకి షిప్ట్ చేసి అక్కడ వైసీపీకే పూర్తిస్థాయిలో సేవలు అందిస్తూ వచ్చారు.. ఈ మధ్యే వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.. మంత్రులు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చడం వెనుక కూడా పీకే ఇచ్చిన నివేదికే కారణం కావొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ సమయంలో.. ఉన్నట్టుండి ప్రశాంత్‌ కిషోర్‌.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.. మరి వైఎస్‌ జగన్‌-పీకేకు ఎందుకు చెడింది.. ఇకపై తన వ్యూహాలను టీడీపీ గెలుపుకోసమే పీకే అందించనున్నారా? అనేది చర్చగా మారింది. మరి కొన్ని రోజుల్లో ఎన్నికలకు రానున్న తరుణంలో వైఎస్‌ జగన్‌కు పీకే షాక్‌ ఇస్తారా? అనేది సంచలనంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • Nara Lokesh
  • prashant kishor
  • Prashant Kishor meets Chandrababu

తాజావార్తలు

  • Ather: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ. 20,000 వరకు ఆదా..

  • Carmeni Selvam: ఆలోచింపచేసేలా ‘కార్మేని సెల్వం’ టీజర్

  • LPG Gas Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది..!

  • USA: “లొంగిపో లేదంటే చంపేస్తాం”.. కొత్త సుప్రీం లీడర్‌కు యూఎస్ వార్నింగ్..

  • Ustaad Bhagat Singh: ‘కాలరే ఎత్తరా’ అంటున్న ఉస్తాద్

ట్రెండింగ్‌

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions