Ambati Rambabu: ప్రశాంత్ కిషోర్-చంద్రబాబు భేటీ.. మంత్రి అంబటి హాట్ కామెంట్స్.. ఆ పీకే, ఈ పీకే వచ్చినా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. అయితే, పీకే-బాబు సమావేశం జరిగిందో లేదో.. అప్పుడే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి.. ఈ భేటీపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి ప్రాణం పోయడానికి పనికిరాడు.. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు అని వ్యాఖ్యానించారు. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా, ఎంతమంది పవన్ కల్యాణ్లు కట్ట కట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం అసాధ్యం అని జోస్యం చెప్పారు.
Read Also: Fire Accident: అంకుర్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు
Also Read
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
- CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
- Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తాడు.. గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశాడని గుర్తుచేసిన అంబటి.. ఈ రోజు లోకేష్ ని కలిశారని తెలిసింది.. గతంలో ప్రశాంత్ కిషోర్పై టీడీపీ చేసిన వ్యాఖ్యలు గుర్తుతెచ్చుకోవాలన్నారు. ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు, లోకేష్ ఎలా దిగజారుతారో గుర్తు చేసుకోండి అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.. ఆ పీకే వచ్చినా, ఈ పీకే వచ్చినా.. టీడీపీ బ్రతకడం అసాధ్యం అని స్పష్టం చేశారు. ఇక, మెటీరియల్ బాగలేకపోతే మేస్త్రి వచ్చినా ఏం చేస్తాడు..? అని ప్రశ్నించారు. టీడీపీ మెటీరియల్ సరిగా లేదు, టీడీపీ కార్యకర్తలు అది గుర్తుపెట్టుకోవాలని సూచించారు అంబటి రాంబాబు.
Read Also: Prashant Kishor meets Chandrababu: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ..
ప్రశాంత్ కిషోర్ చనిపోయిన తెలుగుదేశం పార్టీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు, ప్రాణం పోయడానికి పనికిరాడు అని పేర్కొన్నారు అంబటి.. గతంలో ఉన్న రాబిన్ శర్మ పని అయిపోయిందా.. అందుకే కొత్త వ్యూ కర్తను తెచ్చుకున్నారా..? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఎక్కడికి పారిపోయాడు..? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
-
Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?