YS Jagan: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 4) గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపడుతున్నారు. జగన్ రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లాకు బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అంబటి…
Case Filed Against Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్పై…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్పై విచారణలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువుకు భంగం…
Ambati Arrest: గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వచ్చారు. లాయర్ పోలూరి వెంకటరెడ్డిని అంబటిని కలిసేందుకు పోలీసులు అంగీకరించలేదు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రోవోక్ చేశారన్న కారణంతో అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
Ambati Rambabu: చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని మాజీ మంత్రి అంటి రాంబాబు అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని.. తనను తిట్టినవారినే తిట్టానని చెప్పారు. తాజాగా గుంటూరులోని అంబటి ఇంటి ముందు తాజాగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ వయస్సులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చింది, నన్ను అరెస్ట్ చేస్తారు.…
Ambati Rambabu: గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన…
MLA Arava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను బాధితురాలు వీణా రోజుకొకటి విడుదల చేస్తోంది. అసెంబ్లీలో వీడియో కాల్లో మాట్లాడిన వీడియోను కూడా వీణా బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారం పై ఇప్పటికే పార్టీ నియమించిన విచారణ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు, వాటి వివరాలను విచారణ కమిటీ సేకరిస్తోంది. ఫిబ్రవరి 3,…
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉత్తరాంధ్ర పంచాయతీరాజ్ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తనకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదని, క్షేత్రస్థాయిలో నిజమైన పని మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు పూర్తి నిబద్ధతతో పని చేయాలని పవన్ కల్యాణ్…
Off The Record: కొలుసు పార్ధసారధి.. ఏపీ క్యాబినెట్ మినిస్టర్ అండ్ కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే. గతంలో పెనమలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారధి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తొలిసారి మంత్రి అయ్యారు. 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా….అదే పార్టీ నుంచి 2019లో పెనమలూరు ఎమ్మెల్యే అయ్యారాయన. అప్పుడే మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నా….చివరికి అది జోగి రమేష్ను వరించింది. ఇక అప్పటి నుంచి అసంతృప్తి మొదలవడంతో…
Off The Record: విశాఖలో ‘పొత్తు’ తిరుగుడు పాలిటిక్స్ ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన సర్దుబాట్లు కొత్త పంచాయితీలకు కారణమవుతున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా గ్లాస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ తరహా సమస్యలు పెరుగుతుండగా విశాఖ దక్షిణంలో మాత్రం కొత్త రకం మంట అంటుకుంటోందట. కీలకమైన నియోజక వర్గంలో అంతర్గత పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేనకు చెందిన వంశీకృష్ణ కాగా టీడీపీ ఇన్చార్జ్గా సీతంరాజు సుధాకర్ ఉన్నారు. అధి కారంలోకి వచ్చిన మొదట్లో ఇద్దరి…