Case Filed Against Jogi Ramesh: జోగి రమేష్పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!
- మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదు..
- లోకేష్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు..
- జోగి ఇంటిపై దాడి ఘటనపై కూడా కేసు నమోదు చేయనున్న పోలీసులు..
- అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగి రమేష్..!
Case Filed Against Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్పై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం రావడంతో, ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
Also Read
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
- 10th Student Dies: ఇంటికెళ్లి వస్తామని డాక్టర్కి చెప్పి.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. జోగి వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి ఘటన.. ఈ రెండు అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్, పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగమోహన్ రావుతో కలిసి రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీస్తోంది.
తాజావార్తలు
-
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
-
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
-
Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
-
Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!