Case Filed Against Jogi Ramesh: జోగి రమేష్పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి..!
- మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదు..
- లోకేష్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు..
- జోగి ఇంటిపై దాడి ఘటనపై కూడా కేసు నమోదు చేయనున్న పోలీసులు..
- అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగి రమేష్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case Filed Against Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్పై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం రావడంతో, ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. జోగి వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి ఘటన.. ఈ రెండు అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్, పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగమోహన్ రావుతో కలిసి రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారి తీస్తోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!