Home
Andhra Pradesh Politics
Andhra Pradesh Politics News
-
MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
MP Mithun Reddy: అమరావతి అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం తప్ప అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కూటమి… -
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
YS Jagan Pulivendula Tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకోవడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. అనంతరం భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్భార్లో పాల్గొని… -
Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
Narayanaswamy: సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మాలంటే ఈ కేసుపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని అన్నారు. సాయికృష్ణ నిజంగా నేరస్తుడే అయితే కోర్టులు శిక్షించి ఉండేవని నారాయణస్వామి పేర్కొన్నారు. టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేసిన సందర్భాల్లో కూడా వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని గుర్తు చేశారు. సాయికృష్ణ… -
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
Botsa Satyanarayana : కాకినాడ జిల్లా వెంకటాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కి చెందిన కాపు సామాజికవర్గ నేతల ఆత్మీయ సమావేశం శనివారం ముగిసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక వర్గ కార్యక్రమాలు , కాపులపై జరుగుతున్న దాడుల గురించి నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో… -
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి కాదని, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పేర్కొంటూనే, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులను కుల కోణంలో చూడకూడదని, క్రిమినల్స్కు కులం ఉండదని స్పష్టం చేశారు.. అయితే, నేను హోం మినిస్టర్ కాకపోవడం.. లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేకపోవడం క్రిమినల్స్… -
Off The Record: ప్రకాశం జిల్లా అధికార పార్టీలో పొలిటికల్ హీట్.. ఎంపీ VS మంత్రి..!
Off The Record: ప్రకాశం జిల్లా అధికార టీడీపీలోనే ఇద్దరు అగ్ర నేతల మధ్య కోల్డ్ వార్ పీక్స్కి చేరింది. ఆ ఇద్దరిలో ఒకరు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాగా..మరొకరు రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి. ఇద్దరి మధ్య సింగరాయకొండలో విగ్రహం దగ్గర మొదలైన వివాదం…కనిగిరి వేదికగా రచ్చకెక్కింది. మరోసారి అదే విగ్రహం వద్ద సర్కిల్ పేరుతో వ్యవహారం కేసుల వరకు వెళ్లిందట. గతంలో సింగరాయకొండ అంబేద్కర్ గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న మాగుంట… -
Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశామని తెలిపారు. అనుబంధ విభాగాలను స్వతంత్రంగా, క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక, ప్రతి అనుబంధ విభాగం, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామని సజ్జల తెలిపారు. ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరించి భవిష్యత్ కార్యాచరణ… -
YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు
YS Jagan: ఆంధ్రప్రదేశ్లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రాష్ట్రంలో ప్రజలు న్యాయం కోసం కాకుండా పోలీసులకే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గాదె సాయికృష్ణ కస్టడీ మరణం రాష్ట్రాన్ని కలవరపెడుతోందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారంటూ ఆరోపించారు. అలాగే పోలీసుల వేధింపులే కారణమని… -
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
Off The Record: ఇంతకీ… విషయం ఏంటంటే….గోదావరి పుష్కరాల ప్రారంభానికి ఇక సరిగ్గా ఏడాది కాలం ఉంది. 2027 జూన్ 27న మొదలై….. 12 రోజుల పాటు జరుగుతాయి. ఆ సమయంలో పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుంచి కనీసం 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు అవసరనమైన సదుపాయాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం 8వేల 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. 7 వేల పనులను చేపట్టాలన్న ప్రతిపాదనలు… -
Off The Record: పెనుకొండలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి.. మాటల మంటలు..
Off The Record: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాకముందే… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాతావరణం వేడెక్కుతోంది. కొందరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి. వీరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మరోవైపు మేమేం తక్కువ అంటూ ఇద్దరు మహిళా…
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?